Telugu Global
NEWS

మాగుంట కంపెనీపై దాడులు.... 55 కోట్లు స్వాధీనం !

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు… పూందమల్లిలోని బేవరేజెస్‌ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం. గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు […]

మాగుంట కంపెనీపై దాడులు.... 55 కోట్లు స్వాధీనం !
X

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు… పూందమల్లిలోని బేవరేజెస్‌ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.

గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేయగా… 11 కోట్ల నగదు, ఏడు కిలోల బంగారం దొరికింది. దొరికిన డబ్బు, బంగారానికి… రాత్రి నుంచి జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు.

First Published:  8 Dec 2018 4:42 AM GMT
Next Story