Telugu Global
NEWS

ప్రతిభా భారతి కుటుంబంలో విషాదం

మాజీ స్పీకర్, టీడీపీ నేత ప్రతిభా భారతి తండ్రి జస్టిస్‌ పున్నయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలో మృతిచెందారు. అస్వస్థతకు గురై అక్టోబర్ 26న విశాఖ పినాకిల్‌ ఆస్పత్రిలో పున్నయ్య చేరారు. తండ్రికి చికిత్స జరుగుతున్న సమయంలోనే ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయడంతో ప్రతిభా భారతి కోలుకున్నారు. ఇంతలోనే తండ్రి మరణ వార్త వినాల్సి వచ్చింది. రెండుసార్లు పున్నయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి […]

ప్రతిభా భారతి కుటుంబంలో విషాదం
X

మాజీ స్పీకర్, టీడీపీ నేత ప్రతిభా భారతి తండ్రి జస్టిస్‌ పున్నయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలో మృతిచెందారు. అస్వస్థతకు గురై అక్టోబర్ 26న విశాఖ పినాకిల్‌ ఆస్పత్రిలో పున్నయ్య చేరారు.

తండ్రికి చికిత్స జరుగుతున్న సమయంలోనే ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయడంతో ప్రతిభా భారతి కోలుకున్నారు. ఇంతలోనే తండ్రి మరణ వార్త వినాల్సి వచ్చింది.

రెండుసార్లు పున్నయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామం.

First Published:  1 Dec 2018 12:15 AM GMT
Next Story