Telugu Global
NEWS

టీడీపీని వదిలిపెట్టినందుకు బాధగా ఉంది

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి…. ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం అంటూ టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన సీనియర్ నాయకుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నారా..? అలాంటప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్లు..? పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని.. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలనుకున్నానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో […]

టీడీపీని వదిలిపెట్టినందుకు బాధగా ఉంది
X

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి…. ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం అంటూ టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన సీనియర్ నాయకుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నారా..? అలాంటప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్లు..?

పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని.. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలనుకున్నానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన తుమ్మల ఈ వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

సీఎం కేసీఆర్ బలవంతం చేయడం వల్లే తాను ఎన్నికల బరిలో ఉన్నానని.. ఈ సారి గెలిచి ప్రజలు ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. అయితే తుమ్మల ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అర్థం కాలేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టడం తనను చాలా బాధించిందని… పాలేరు టీడీపీ కార్యకర్తలతో పూర్తిగా చర్చించిన తర్వాతే టీఆర్ఎస్‌లో చేరానని అన్నారు. మంత్రి ఇలా నిర్వేదంగా మాట్లాడటం కార్యకర్తలకు ఆందోళన కలిగించింది. ఓడిపోతాననే అనుమానంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

First Published:  30 Nov 2018 1:19 AM GMT
Next Story