Telugu Global
NEWS

నా అవిటితనాన్ని హేళన చేశావ్‌.... లక్ష చేతులతో ఓడిస్తా " భూపాల్ రెడ్డి కన్నీటి పర్యంతం

నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. భూపాల్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి రమాదేవి ప్రచారానికి రాగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్ ప్రచార రథంపై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. డ్రైవర్‌ను కొట్టారు. దీన్ని నిరసిస్తూ కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు స్థానిక క్లాక్‌ టవర్‌ వద్ద నిరసనకు దిగారు. ఓటమి భయంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి దాడులు చేయిస్తున్నారని భూపాల్ రెడ్డి ఆరోపించారు. దాడులు చేయించడమే కాకుండా…. […]

నా అవిటితనాన్ని హేళన చేశావ్‌.... లక్ష చేతులతో ఓడిస్తా  భూపాల్ రెడ్డి కన్నీటి పర్యంతం
X

నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. భూపాల్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి రమాదేవి ప్రచారానికి రాగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.

టీఆర్‌ఎస్ ప్రచార రథంపై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. డ్రైవర్‌ను కొట్టారు. దీన్ని నిరసిస్తూ కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు స్థానిక క్లాక్‌ టవర్‌ వద్ద నిరసనకు దిగారు. ఓటమి భయంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి దాడులు చేయిస్తున్నారని భూపాల్ రెడ్డి ఆరోపించారు.

దాడులు చేయించడమే కాకుండా…. తన అవిటితనాన్ని(భూపాల్ రెడ్డికి ఒక చేయిలేదు) హేళన చేస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భర్త కంటతడి పెట్టడంతో భూపాల్ రెడ్డి భార్య, ఆయన కూతురు కూడా విలపించారు.

తన అవిటి తనాన్ని కోమటి రెడ్డి హేళన చేశారని…. కానీ ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డిని లక్షల చేతులతో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి అహంభావానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

First Published:  25 Nov 2018 12:40 AM GMT
Next Story