Telugu Global
Cinema & Entertainment

హీరోగా కలిసి రావట్లేదు.... మరి ప్రొడ్యూసర్ గా నైనా కలిసొస్తుందా?

తెలుగు హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమా నిర్మాణంలోకి దిగేశారు. ఇక కుర్ర హీరోల్లో సుధీర్ బాబు కూడా ఇటీవలే “నన్ను దోచుకుందువటే” సినిమాతో నిర్మాతగా మారాడు. అయితే తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నిర్మాతగా మారబోతున్నాడట. సందీప్ కిషన్ తన కెరీర్ మొదట్లో పెద్ద హిట్స్ లేకపోవడంతో సొంతగా నిర్మాణ సంస్థ పెట్టాలి అనుకున్నాడు. కానీ అదే టైం లో “వెంకటాద్రి […]

హీరోగా కలిసి రావట్లేదు.... మరి ప్రొడ్యూసర్ గా నైనా కలిసొస్తుందా?
X

తెలుగు హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమా నిర్మాణంలోకి దిగేశారు. ఇక కుర్ర హీరోల్లో సుధీర్ బాబు కూడా ఇటీవలే “నన్ను దోచుకుందువటే” సినిమాతో నిర్మాతగా మారాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నిర్మాతగా మారబోతున్నాడట. సందీప్ కిషన్ తన కెరీర్ మొదట్లో పెద్ద హిట్స్ లేకపోవడంతో సొంతగా నిర్మాణ సంస్థ పెట్టాలి అనుకున్నాడు. కానీ అదే టైం లో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమాతో హిట్ అందుకున్నాడు సందీప్ కిషన్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సందీప్ కిషన్ సరైన ఒక్క హిట్ కూడా లేదు.

సో ఇలాంటి టైం లోనే కొత్తగా ఒక నిర్మాణ సంస్థ పెట్టాలి అని సందీప్ కిషన్ భావిస్తున్నాడట. ”వెంకటాద్రి టాకీస్” అనే బ్యానర్ మీద కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడట సందీప్. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “పెట్టా” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సందీప్ కిషన్ తో సినిమా గురించి ఆలోచిస్తాడట కార్తీక్ సుబ్బరాజ్.

సందీప్ కిషన్ కు హీరోగా కలిసి రావట్లేదు…. మరి ప్రొడ్యూసర్ గానైనా కలిసిసొస్తుందో? చూడాలి.

First Published:  23 Nov 2018 5:25 AM GMT
Next Story