Telugu Global
NEWS

నేను చౌదరి అమ్మాయినే.... ఏపీలో టీడీపీ మళ్లీ గెలిస్తే ఆస్తులు అమ్మేసి తెలంగాణకు వచ్చేస్తాం " నటి అపూర్వ

సినీ నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె… 2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి రావాలని దేవుడిని వేడుకున్నానన్నారు. తాను చౌదరి అమ్మాయినే అని… తొలి నుంచి తన కుటుంబం తెలుగుదేశం పార్టీకే ఓటేసిందన్నారు. జగన్‌ వయసులో చిన్నవాడు కాబట్టి రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేడు అని భావించి చంద్రబాబు అధికారంలోకి రావాలని 2014లో ఆఖరి వరకు దేవుడిని వేడుకున్నానన్నారు. కానీ […]

నేను చౌదరి అమ్మాయినే.... ఏపీలో టీడీపీ మళ్లీ గెలిస్తే ఆస్తులు అమ్మేసి తెలంగాణకు వచ్చేస్తాం  నటి అపూర్వ
X

సినీ నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె… 2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి రావాలని దేవుడిని వేడుకున్నానన్నారు. తాను చౌదరి అమ్మాయినే అని… తొలి నుంచి తన కుటుంబం తెలుగుదేశం పార్టీకే ఓటేసిందన్నారు.

జగన్‌ వయసులో చిన్నవాడు కాబట్టి రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేడు అని భావించి చంద్రబాబు అధికారంలోకి రావాలని 2014లో ఆఖరి వరకు దేవుడిని వేడుకున్నానన్నారు. కానీ అదే చంద్రబాబు హయాంలో తమ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు వస్తే న్యాయం జరుగుతుందనుకున్న తామే…. ఇప్పుడు పడని కష్టం లేదన్నారు. చింతమనేని తనకు వ్యతిరేకంగా ఉండే వారికి నరకం చూపిస్తున్నారని ఆవేదన చెందారు. రావణ సినిమాలో పోసాని పాత్రలో ముగ్గురు పిల్లలను పెంచుతుంటారని… వారిలో ఇద్దరిని ఒకలా… మరొకడిని మరోలా చూస్తుంటారని… ఇప్పుడు పాలన కూడా అలాగే ఉందన్నారు.

జగన్‌ వస్తే లా అండ్ ఆర్డర్ ఉండదని భావించానని… కానీ ఇటీవల ఎయిర్‌పోర్టులో కత్తితోదాడి జరిగితే జగన్‌ ఏమాత్రం దాన్ని సీన్ చేయకుండా వెళ్లిపోయిన తీరు… ఆ మెచ్యూరిటీ లెవల్స్ అభినందనీయమన్నారు.

ఒకవేళ జగన్‌ అలా చేయకుండా సీన్‌ చేసి ఉంటే కార్యకర్తలు అంతా రెచ్చిపోయేవారని.. కానీ జగన్‌ అలా చేయకుండా బాధను బిగబెట్టుకుని వచ్చిన తీరు చూసిన తర్వాత 2014లో తాను జగన్‌ గురించి అనుకున్న అంచనాలు తప్పు అని రియలైజ్ అయ్యానన్నారు.

టీడీపీలో కూడా మంచినాయకులు ఉన్నారని అపూర్వ చెప్పారు. చింతమనేని ఇష్టానుసారం మాట్లాడుతుంటే దాన్ని చంద్రబాబు ఎందుకు కంట్రోల్ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ఏపీలో ఆస్తులు అమ్ముకుని తెలంగాణకు వచ్చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజలు హ్యాపీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

First Published:  21 Nov 2018 10:35 AM GMT
Next Story