Telugu Global
NEWS

శివాజీకి రాచమర్యాదలకు రంగం సిద్ధం!

ఏపీలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని… ఆ తర్వాత అల్లర్లు జరుగుతాయని ఆపరేషన్ గరుడ పురాణం వినిపించిన నటుడు శివాజీ… సరిగ్గా జగన్‌పై దాడి జరిగే సమయానికి అమెరికాలో ఉన్నారు. శివాజీ చెప్పినట్టుగానే జగన్‌పై దాడి జరగడంతో… అప్పటి వరకు ఆపరేషన్ గరుడను లైట్‌ తీసుకున్న వారు… నటుడు శివాజీని అరెస్ట్ చేసి దీనిపై లోతుగా విచారణ జరిపించాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. శివాజీ నేరుగా మీడియా ముందే దాడులు, అల్లర్ల గురించి చెప్పినా ఆయన్ను ఎందుకు చంద్రబాబు […]

శివాజీకి రాచమర్యాదలకు రంగం సిద్ధం!
X

ఏపీలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని… ఆ తర్వాత అల్లర్లు జరుగుతాయని ఆపరేషన్ గరుడ పురాణం వినిపించిన నటుడు శివాజీ… సరిగ్గా జగన్‌పై దాడి జరిగే సమయానికి అమెరికాలో ఉన్నారు.

శివాజీ చెప్పినట్టుగానే జగన్‌పై దాడి జరగడంతో… అప్పటి వరకు ఆపరేషన్ గరుడను లైట్‌ తీసుకున్న వారు… నటుడు శివాజీని అరెస్ట్ చేసి దీనిపై లోతుగా విచారణ జరిపించాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. శివాజీ నేరుగా మీడియా ముందే దాడులు, అల్లర్ల గురించి చెప్పినా ఆయన్ను ఎందుకు చంద్రబాబు పోలీసులు విచారించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబు కాబట్టే శివాజీని విచారించడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా శివాజీ అమెరికాలోనే ఉంటున్నారు. అయితే ఎట్టకేలకు ఈనెల 21న తాను అమెరికా నుంచి వస్తున్నానని శివాజీ చెప్పారు.

అయితే ఇండియా వస్తే తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. జగన్‌పై దాడి తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. కాబట్టి తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఏపీ హోంమంత్రి చినరాజప్పకు, ఏపీ డీజీపీకి, తెలంగాణ డీజీపీకి శివాజీ లేఖలు రాశారు.

మాజీ పోలీసు అధికారులు మాత్రం… మొత్తం ఎపిసోడ్‌ను గమనించిన తర్వాత… శివాజీ ఇండియా రాగానే తొలుత అతడిని అదుపులోకి తీసుకుని ఆపరేషన్ గరుడ గురించి విచారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటున్నారు.

ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే సీరియస్ అయ్యే పోలీసులు… ఒక నటుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే అంశాల గురించి చెబుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అసాధారణ పరిణామమని అభిప్రాయపడుతున్నారు.

చూడాలి… శివాజీ ఏపీకి రాగానే భద్రత కల్పించి రాచమర్యాదలు చేస్తారో…. లేక ఆపరేషన్ గరుడ పురాణ రహస్యాలు రాబట్టి…. రాష్ట్రాన్ని కాపాడేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తారో.

వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి శివాజీకి రాచమర్యాదలు చేయడానికి, పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివాజీకి కర్త,కర్మ,క్రియ అయి నడిపించిన ఒక మీడియా అధిపతి శివాజీ బాగోగుల గురించి ఆరాటపడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  14 Nov 2018 11:10 PM GMT
Next Story