Telugu Global
NEWS

లోకేష్.... తెలిసే మాట్లాడుతున్నావా?

2019 ఎన్నికల తర్వాత ఈ దేశానికి ప్రధానిగా ఎవరుండాలన్నది తన తండ్రి చంద్రబాబే నిర్ణయిస్తారని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. లోకేష్ అసలు తెలిసి మాట్లాడుతున్నాడా…. లేక తెలియక మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానంటూ రాహుల్‌ గాంధీ వద్దకు చంద్రబాబు వచ్చారని… ఇప్పుడేమో 2019లో ప్రధానిగా ఎవరుండాలో తాము నిర్ణయిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అవడం టీడీపీకి […]

లోకేష్.... తెలిసే మాట్లాడుతున్నావా?
X

2019 ఎన్నికల తర్వాత ఈ దేశానికి ప్రధానిగా ఎవరుండాలన్నది తన తండ్రి చంద్రబాబే నిర్ణయిస్తారని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. లోకేష్ అసలు తెలిసి మాట్లాడుతున్నాడా…. లేక తెలియక మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు.

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానంటూ రాహుల్‌ గాంధీ వద్దకు చంద్రబాబు వచ్చారని… ఇప్పుడేమో 2019లో ప్రధానిగా ఎవరుండాలో తాము నిర్ణయిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అవడం టీడీపీకి ఇష్టం లేదన్నది దీని బట్టి స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో అన్యోన్యంగా కాపురం చేసిన టీడీపీ ఇప్పుడు బీజేపీకి తాము వ్యతిరేకం అంటూ వచ్చి దేశానికి ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయిస్తామనడం సరైన పద్దతి కాదన్నారు.

అన్ని పార్టీలు కలిసి వస్తేనే దేశంలో మోడీ పాలనను అంతమొందించడం సాధ్యమవుతుందన్నారు. నారా లోకేష్‌ వివిధ దేశాల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తే ఇబ్బంది ఉండదు కానీ… అనవసరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు తేవొద్దు అని బైరెడ్డి సూచించారు.

First Published:  15 Nov 2018 1:17 AM GMT
Next Story