Telugu Global
Cinema & Entertainment

జనవరి నుంచి బ్యాడ్మింటన్ ఆడతాడట....

సుధీర్ బాబు, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ అందరిని అబ్బురపరుస్తోంది. ఇప్పుడిప్పుడే మంచి హిట్స్ అందుకున్న సుధీర్ బాబు కి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక అద్భుతమైన కథని వినిపించాడట. ప్రవీణ్ సత్తారు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వెరైటీ జోనర్ సినిమాలు తీయడంలో దిట్ట. నేషనల్ అవార్డ్ సంపాదించిన గొప్ప దర్శకుడు. ఇటీవలే రాజశేఖర్ తో “గరుడవేగ” వంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి ఊపు మీద ఉన్నాడు. మరోవైపు సుధీర్ బాబు కూడా”సమ్మోహనం” “నన్ను […]

జనవరి నుంచి బ్యాడ్మింటన్ ఆడతాడట....
X

సుధీర్ బాబు, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ అందరిని అబ్బురపరుస్తోంది. ఇప్పుడిప్పుడే మంచి హిట్స్ అందుకున్న సుధీర్ బాబు కి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక అద్భుతమైన కథని వినిపించాడట. ప్రవీణ్ సత్తారు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వెరైటీ జోనర్ సినిమాలు తీయడంలో దిట్ట. నేషనల్ అవార్డ్ సంపాదించిన గొప్ప దర్శకుడు.

ఇటీవలే రాజశేఖర్ తో “గరుడవేగ” వంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి ఊపు మీద ఉన్నాడు. మరోవైపు సుధీర్ బాబు కూడా”సమ్మోహనం” “నన్ను దోచుకుందువటే” సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరి హిట్ కాంబినేషన్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు “పుల్లెల గోపిచంద్” బయోపిక్ ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.ఈ చిత్రం ఇద్దరికి మంచి విజయాన్ని ఇస్తుందని అశిస్తున్నారు.

ఒక ప్రెస్టేజి ప్రాజెక్ట్ గా దీన్ని తీయాలని ప్రవీణ్ ఉన్నాడు.ఈ మధ్య తెలుగులో బయోపిక్ లు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలో ఏది విజయం సాధిస్తుందన్న విషయంపై అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చేయబోతున్నామని సుధీరబాబు తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.మొత్తానికి తెలుగు మరో ఆసక్తికరమైన బయోపిక్ తెరకెక్కబోతోంది. మరి ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

First Published:  13 Nov 2018 11:21 PM GMT
Next Story