Telugu Global
NEWS

చేతికి మట్టి అంటకుండా వైఎస్‌ను చంపేశారు....

జగన్‌పై హత్యాయత్నం ఘటన చూసిన తర్వాత వైఎస్‌ మరణంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్తూ చనిపోవడం వెనుక నాటి యూపీఏ సర్కార్‌తో పాటు టీడీపీ హస్తముందని ఆరోపించారు. ఎక్కడా చేతికి మట్టి అంటకుండా ప్లాన్‌గా వైఎస్‌ఆర్‌ మరణించేలా కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. అదే తరహాలో వైఎస్‌ జగన్‌ను కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ […]

చేతికి మట్టి అంటకుండా వైఎస్‌ను చంపేశారు....
X

జగన్‌పై హత్యాయత్నం ఘటన చూసిన తర్వాత వైఎస్‌ మరణంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్తూ చనిపోవడం వెనుక నాటి యూపీఏ సర్కార్‌తో పాటు టీడీపీ హస్తముందని ఆరోపించారు.

ఎక్కడా చేతికి మట్టి అంటకుండా ప్లాన్‌గా వైఎస్‌ఆర్‌ మరణించేలా కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. అదే తరహాలో వైఎస్‌ జగన్‌ను కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ పెద్దలు జగన్‌ హత్యకు కుట్ర చేశారన్నారు. జగన్‌ హత్యకు గత ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా ఉండవని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

First Published:  12 Nov 2018 10:40 PM GMT
Next Story