Telugu Global
NEWS

జానారెడ్డి, ఉత్తమ్‌ను ఓడిస్తాం " కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు రాజుకుంది. ఆందోళనలతో గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. సీట్లు రాని వారు, పొత్తులో భాగంగా తమ టికెట్లను టీజేఎస్‌, టీడీపీ ఎత్తుకెళ్తున్న చోట బాధితులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు. ఇదే తరహాలో నల్లగొండ జిల్లా నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. పొత్తులో భాగంగా నకిరేకల్‌ సీటును వదులుకునే ప్రసక్తే లేదని… ఆ స్థానాన్ని […]

జానారెడ్డి, ఉత్తమ్‌ను ఓడిస్తాం  కోమటిరెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు రాజుకుంది. ఆందోళనలతో గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. సీట్లు రాని వారు, పొత్తులో భాగంగా తమ టికెట్లను టీజేఎస్‌, టీడీపీ ఎత్తుకెళ్తున్న చోట బాధితులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు.

ఇదే తరహాలో నల్లగొండ జిల్లా నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.

ఈ ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. పొత్తులో భాగంగా నకిరేకల్‌ సీటును వదులుకునే ప్రసక్తే లేదని… ఆ స్థానాన్ని లింగయ్యకే కేటాయించాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌ టికెట్‌ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి ల ఓటమి ఖాయమని ఆయన హెచ్చరించారు.

ఇది వరకే ఒకసారి నకిరేకల్ నుంచి పోటీ చేసిన లింగయ్యకు టికెట్‌ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయబోనని వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. పొత్తులో భాగంగా నకిరేకల్ టికెట్‌ను టీడీపీకి కట్టబెట్టాలని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

అలా చేయడం ద్వారా వెంకట్ రెడ్డి అనుచరుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ రాకుండా అడ్డుకోవచ్చన్నది ఉత్తమ్‌ ఆలోచన అని లింగయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు.

అయితే ఒకవేళ లింగయ్యకు టికెట్‌ ఇవ్వకపోతే మాత్రం కోమటిరెడ్డి కూడా బరిలో దిగరని…. కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు.

First Published:  9 Nov 2018 4:33 AM GMT
Next Story