Telugu Global
NEWS

ఉండవల్లిలో నడిరోడ్డుపై కత్తితో యువకుడి బీభత్సం

గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. కత్తి తీసుకుని నడిరోడ్డుపై అందరినీ బెదరగొట్టాడు. ప్రదీప్‌ అనే యువకుడు ఇటీవల జనతా గ్యారేజ్‌ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ క్రియేట్ చేశాడు. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే ఈ గ్రూప్‌లో తనకు తెలియజేయాలని సూచించాడు. అలా సమస్యలు చెబితే తానే నేరుగా రంగంలోకి దిగి పరిష్కరిస్తానంటూ ప్రకటించుకున్నాడు. ఈ గ్రూప్‌లో ఇతడి తరహాలాంటి వారే మరికొందరు కూడా చేరారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ప్రదీప్‌ బామ్మర్దిని […]

ఉండవల్లిలో నడిరోడ్డుపై కత్తితో యువకుడి బీభత్సం
X

గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. కత్తి తీసుకుని నడిరోడ్డుపై అందరినీ బెదరగొట్టాడు. ప్రదీప్‌ అనే యువకుడు ఇటీవల జనతా గ్యారేజ్‌ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ క్రియేట్ చేశాడు. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే ఈ గ్రూప్‌లో తనకు తెలియజేయాలని సూచించాడు.

అలా సమస్యలు చెబితే తానే నేరుగా రంగంలోకి దిగి పరిష్కరిస్తానంటూ ప్రకటించుకున్నాడు. ఈ గ్రూప్‌లో ఇతడి తరహాలాంటి వారే మరికొందరు కూడా చేరారు.

ఈ నేపథ్యంలో గత రాత్రి ప్రదీప్‌ బామ్మర్దిని కొందరు కొట్టారు. దీంతో కొట్టిన వారి ఇంటి వద్దకు వెళ్లిన ప్రదీప్‌ కత్తి తీసుకుని నడిరోడ్డుపై కేకలు వేస్తూ రచ్చ చేశాడు. రండిరా నరికేస్తా అంటూ ఊగిపోయాడు.

ప్రదీప్‌ వెళ్లిన సంగతి తెలుసుకున్న వాట్సాప్‌ గ్రూపులోని ఇతర మూక కూడా అక్కడికి వచ్చింది. దాదాపు 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఏమాత్రం భయం లేకుండా ప్రదీప్‌ కత్తితో విహరించాడు. ప్రదీప్‌ ఎవరినో హత్య చేయబోతున్నాడన్న భయంతో ప్రజలు, దుకాణ దారులు పరుగులు తీశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు స్థానికంగా జనాన్ని బెదిరిస్తూ, సెటిల్‌మెంట్లు చేస్తుంటారని చెబుతున్నారు.

First Published:  5 Nov 2018 4:14 AM GMT
Next Story