Telugu Global
NEWS

ఇలాంటి దుర్మార్గాలు టీడీపీకే సాధ్యం!

దేశంలో చాలా పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడతాయి. చాలా చోట్ల అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే వారెవరూ ఈ తరహాలో సభ్యత్వ నమోదు మాత్రం చేయరు. ప్రతి పార్టీ కూడా వీలైనంత ఎక్కువమందికి సభ్యత్వాలను ఇవ్వాలనే అనుకుంటుంది. ఆ మేరకు ఆ పార్టీల నేతలు ఏవో పాట్లు పడుతూ ఉంటారు. అయితే టీడీపీలా తెగించే వాళ్లు మాత్రం తక్కువ మందే ఉంటారు. టీడీపీకే కొన్ని రకాల దుర్మార్గాలు సాధ్యం అవుతూ […]

ఇలాంటి దుర్మార్గాలు టీడీపీకే సాధ్యం!
X

దేశంలో చాలా పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడతాయి. చాలా చోట్ల అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే వారెవరూ ఈ తరహాలో సభ్యత్వ నమోదు మాత్రం చేయరు. ప్రతి పార్టీ కూడా వీలైనంత ఎక్కువమందికి సభ్యత్వాలను ఇవ్వాలనే అనుకుంటుంది. ఆ మేరకు ఆ పార్టీల నేతలు ఏవో పాట్లు పడుతూ ఉంటారు.

అయితే టీడీపీలా తెగించే వాళ్లు మాత్రం తక్కువ మందే ఉంటారు. టీడీపీకే కొన్ని రకాల దుర్మార్గాలు సాధ్యం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి.

ఇటీవలే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెడుతూ తన పార్టీ శ్రేణులకు భారీ టార్గెట్ కూడా సెట్ చేశాడు. ఇంతలోనే ఒకటో తేదీ వచ్చింది. ఇంకేముంది టీడీపీ వాళ్లు పెన్షనర్ల మీద పడ్డారు.
వికలాంగుల, వృద్ధులకు వచ్చే పెన్షన్లలో కోత వేస్తున్నారు.

వాళ్ల డబ్బుతో టీడీపీ నేతలు తమ సభ్యత్వ నమోదు టార్గెట్ ను రీచ్ అవుతున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది? ఇంత బరి తెగింపు ఎవరికైనా సాధ్యం అవుతుందా? టీడీపీకి మాత్రమే ఇలాంటి పనులు సాధ్యం అవుతాయి.

First Published:  3 Nov 2018 10:49 AM GMT
Next Story