Telugu Global
NEWS

తిరుమలలో పూజారిపై ఇద్దరు మహిళల లైంగిక.... డ్రామా

తిరుమల అర్చక నిలయంలో ఊహించని హైడ్రామా జరిగింది.ఇద్దరు అర్చకుల మధ్య గొడవ స్కెచ్‌లు గీసుకునే స్థాయికి వెళ్లింది. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని తోటి అర్చకుడిని బదనాం చేసేందుకు మరో అర్చకుడు ప్రయత్నించారు. తిరుమల అర్చక నిలయంలో అర్చకులు మణికంఠ, మారుతీ స్వామి మధ్య గొడవ నడుస్తోంది. ఈనేపథ్యంలో మణికంఠపై లైంగిక వేధింపుల నిందను మోపేందుకు మారుతీ స్వామి ప్లాన్ చేశాడు. కానిస్టేబుల్‌ మధుతో కలిసి మారుతీ స్వామి డీల్‌ కుదుర్చుకున్నాడు. మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేశారు. […]

తిరుమలలో పూజారిపై ఇద్దరు మహిళల లైంగిక.... డ్రామా
X

తిరుమల అర్చక నిలయంలో ఊహించని హైడ్రామా జరిగింది.ఇద్దరు అర్చకుల మధ్య గొడవ స్కెచ్‌లు గీసుకునే స్థాయికి వెళ్లింది. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని తోటి అర్చకుడిని బదనాం చేసేందుకు మరో అర్చకుడు ప్రయత్నించారు.

తిరుమల అర్చక నిలయంలో అర్చకులు మణికంఠ, మారుతీ స్వామి మధ్య గొడవ నడుస్తోంది. ఈనేపథ్యంలో మణికంఠపై లైంగిక వేధింపుల నిందను మోపేందుకు మారుతీ స్వామి ప్లాన్ చేశాడు. కానిస్టేబుల్‌ మధుతో కలిసి మారుతీ స్వామి డీల్‌ కుదుర్చుకున్నాడు.

మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు మారుతీ స్వామి రెండు లక్షలు ఇచ్చాడు. ప్లాన్‌లో భాగంగా ఇద్దరు మహిళలను ఏర్పాటు చేసిన కానిస్టేబుల్‌ మధు… అర్చకుడు మణికంఠ పైకి వారిని ఉసిగొల్పాడు.

ఇద్దరు మహిళలు వెళ్లి అర్చకుడి మణికంఠ తమను లైంగిక వేధిస్తున్నాడంటూ దాడి చేసి కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వ్యవహారాన్ని లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ మధు తమకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయాల్సిందిగా చెప్పాడని మహిళలు ఒప్పుకున్నారు.

First Published:  30 Oct 2018 12:16 AM GMT
Next Story