Telugu Global
NEWS

జగన్‌ను హత్య చేయించబోయింది విజయమ్మ, షర్మిలే " టీడీపీ ఎమ్మెల్సీ

జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జగన్‌ హత్యకు తాము ప్లాన్‌ చేస్తే భారీ స్థాయిలో ఉంటుందని సోమిరెడ్డి చెప్పగా… టీడీపీ కార్యకర్తలు అనుకుంటే జగన్‌ను పాదయాత్రలోనే నడిరోడ్డుపైనే కైమా కైమాగా నరికేస్తారని ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ కూడా ఆ జాబితాలో చేరారు. ఈయన ఏకంగా జగన్‌ను హత్య చేయించబోయింది ఆయన తల్లి విజయమ్మేనని చెప్పారు. జగన్‌ను హత్య చేయించడానికి విజయమ్మ, షర్మిల […]

జగన్‌ను హత్య చేయించబోయింది విజయమ్మ, షర్మిలే  టీడీపీ ఎమ్మెల్సీ
X

జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జగన్‌ హత్యకు తాము ప్లాన్‌ చేస్తే భారీ స్థాయిలో ఉంటుందని సోమిరెడ్డి చెప్పగా… టీడీపీ కార్యకర్తలు అనుకుంటే జగన్‌ను పాదయాత్రలోనే నడిరోడ్డుపైనే కైమా కైమాగా నరికేస్తారని ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు టీడీపీఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ కూడా ఆ జాబితాలో చేరారు. ఈయన ఏకంగా జగన్‌ను హత్య చేయించబోయింది ఆయన తల్లి విజయమ్మేనని చెప్పారు. జగన్‌ను హత్య చేయించడానికి విజయమ్మ, షర్మిల కలిసి కుట్ర పన్నారని బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

షర్మిల, విజయమ్మలు నాయకత్వ స్థానంలోకి రాకుండా జగన్‌ వారిని ఇంటికే పరిమితం చేశారని…. వారిని జగన్‌ అణచివేస్తున్నారని బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అందుకే జగన్‌ను హత్య చేయించేందుకు వారు కుట్ర పన్నారని చెప్పారు.

జగన్‌ చనిపోతే ఆ స్థానంలోకి రావొచ్చు అని విజయమ్మ, షర్మిల భావించారన్నారు. జగన్‌ను చంపేసి ఆ సానుభూతి ఓట్లతో అధికారంలోకి వచ్చి పదవులు చేపట్టవచ్చని విజయమ్మ, షర్మిల కుట్ర చేశారని ఆరోపించారు.

First Published:  29 Oct 2018 8:57 PM GMT
Next Story