Telugu Global
Cinema & Entertainment

ఇదో ప్రయోగం... 2 వారాల గ్యాప్ లో 2 సినిమాలు

సాధారణంగా పెద్ద సినిమాల మధ్య కాస్త గ్యాప్ ఇవ్వాలని చూస్తారు. ఇక ఒకే బ్యానర్ కు చెందిన సినిమాలకైతే ఈ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం నెల రోజులు గ్యాప్ ఇస్తారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈ రూల్స్ ను చెరిపేస్తోంది. తమ సినిమాకు పోటీగా, తమ బ్యానర్ నుంచే ఇంకో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సవ్యసాచి సినిమా వచ్చేనెల 2న థియేటర్లలోకి […]

ఇదో ప్రయోగం... 2 వారాల గ్యాప్ లో 2 సినిమాలు
X

సాధారణంగా పెద్ద సినిమాల మధ్య కాస్త గ్యాప్ ఇవ్వాలని చూస్తారు. ఇక ఒకే బ్యానర్ కు చెందిన సినిమాలకైతే ఈ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం నెల రోజులు గ్యాప్ ఇస్తారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈ రూల్స్ ను చెరిపేస్తోంది. తమ సినిమాకు పోటీగా, తమ బ్యానర్ నుంచే ఇంకో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సవ్యసాచి సినిమా వచ్చేనెల 2న థియేటర్లలోకి రాబోతోంది. సరిగ్గా ఈ సినిమా రిలీజైన 2 వారాలకు ఇదే బ్యానర్ నుంచి అమర్-అక్బర్-ఆంటోనీ సినిమాను విడుదలకు సిద్ధంచేశారు. ఈ కాలం ఓ సినిమా 2 వారాలు ఆడితే అదే పెద్ద విషయం. ఆ సమీకరణం ఆధారంగా ఈ ప్లాన్ వేశారా.. లేక సవ్యసాచి రిజల్ట్ పై అనుమానంతో షార్ట్ గ్యాప్ లోనే రవితేజ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారా అనేది డౌట్.

మొత్తమ్మీద ఒకే బ్యానర్ నుంచి ఇలా 2 వారాల గ్యాప్ లో 2 సినిమాలు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. దీన్ని కాస్త సాహసోపేత నిర్ణయంగా కూడా చెబుతున్నారు విశ్లేషకులు. ఇండస్ట్రీలో లక్కీ హ్యాండ్ గా పేరున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈసారి హిట్ కొడతారో, నష్టాలు చవిచూస్తారో నవంబర్ లో తేలిపోతుందన్నమాట.

First Published:  29 Oct 2018 8:03 AM GMT
Next Story