Telugu Global
NEWS

జగన్‌ వ్యాఖ్యలు.... బొబ్బిలి రాజుకు పౌరుషం వచ్చిందోచ్‌....

ఫిరాయింపు మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావుకు పౌరుషం వచ్చింది. బొబ్బిలి పౌరుషాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ ఫిరాయించి, అశోక్‌ గజపతి రాజుతో సుజయ్‌ కృష్ణ చేతులు కలిపారని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బొబ్బిలి రాజుల పౌరుషం గురించి జగన్‌కు ఏం తెలుసు అని ప్రశ్నించారు. అవినీతికి అడ్డాగా ఉండి వేల కోట్లు అడ్డదారిలో సంపాదించుకున్న వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. నీ తండ్రిని, నీ కుటుంబాన్ని దూషించిన బొత్స సత్యనారాయణను పార్టీలోకి ఎలా […]

జగన్‌ వ్యాఖ్యలు.... బొబ్బిలి రాజుకు పౌరుషం వచ్చిందోచ్‌....
X

ఫిరాయింపు మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావుకు పౌరుషం వచ్చింది. బొబ్బిలి పౌరుషాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ ఫిరాయించి, అశోక్‌ గజపతి రాజుతో సుజయ్‌ కృష్ణ చేతులు కలిపారని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బొబ్బిలి రాజుల పౌరుషం గురించి జగన్‌కు ఏం తెలుసు అని ప్రశ్నించారు.

అవినీతికి అడ్డాగా ఉండి వేల కోట్లు అడ్డదారిలో సంపాదించుకున్న వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. నీ తండ్రిని, నీ కుటుంబాన్ని దూషించిన బొత్స సత్యనారాయణను పార్టీలోకి ఎలా చేర్చుకున్నావని ప్రశ్నించారు. అలాంటి నీకు బొబ్బిలిరాజుల పౌరుషం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. నిజాయితీకి మారుపేరైన అశోక్‌గజపతిరాజుతో కలిసి పనిచేస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఎప్పుడో విజయనగరానికి, బొబ్బిలికి యుద్ధం జరిగితే ఇప్పుడు కూడా విరోధులుగా ఉండాలా? అని జగన్‌ని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణను వైసీపీలో చేర్చుకున్నారు కాబట్టే తాను ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరానని వెల్లడించారు. ఆ సంగతి జగన్‌కు కూడా తెలుసన్నారు. బొబ్బిలి పౌరుషం గురించి, బొబ్బిలి యుద్ధం గురించి జగన్‌ బాగా చదువుకుని తెలుసుకోవాలని సుజయ్‌ కృష్ణ సలహా ఇచ్చారు.

First Published:  23 Oct 2018 7:00 AM GMT
Next Story