Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడో సినిమా ప్రకటించాడు

తన సినిమాలకు ఎంత బడ్జెట్ అవుతోంది.. ఎంత రెవెన్యూ వస్తోంది.. బ్రేక్-ఈవెన్ అవుతుందా లేదా.. అసలు తన మార్కెట్ ఏంటి..? ఇలాంటి విషయాలు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు అనవసరం. తండ్రి అండతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా మరో మూవీ ప్రకటించాడు. ప్రస్తుతం బెల్లంకొండ చేతిలో 2 సినిమాలున్నాయి. శ్రీనివాస్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిస్టర్ పోలీస్ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు తేజ దర్శకత్వంలో ఇంకో […]

ముచ్చటగా మూడో సినిమా ప్రకటించాడు
X

తన సినిమాలకు ఎంత బడ్జెట్ అవుతోంది.. ఎంత రెవెన్యూ వస్తోంది.. బ్రేక్-ఈవెన్ అవుతుందా లేదా.. అసలు తన మార్కెట్ ఏంటి..? ఇలాంటి విషయాలు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు అనవసరం. తండ్రి అండతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా మరో మూవీ ప్రకటించాడు.

ప్రస్తుతం బెల్లంకొండ చేతిలో 2 సినిమాలున్నాయి. శ్రీనివాస్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిస్టర్ పోలీస్ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు తేజ దర్శకత్వంలో ఇంకో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండూ సెట్స్ పై ఉన్నాయి. సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి. వీటికి అదనంగా మూడో సినిమా ప్రకటించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. గతంలో ఒక ఊరిలో, వీర, రైడ్, అమ్మాయితో అబ్బాయి లాంటి సినిమాలను డైరక్ట్ చేశాడు రమేష్ వర్మ. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు బెల్లంకొండతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేశాడు.

బెల్లంకొండ చేతిలో ఉన్న ఈ 3 సినిమాల్లో ఒక సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మిగతా 2 సినిమాల్ని వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ 3 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు బెల్లంకొండ.

First Published:  23 Oct 2018 6:03 AM GMT
Next Story