Telugu Global
NEWS

జగన్‌ కోసం యాగం... హాజరైన టీడీపీ పిన్నమనేని

గుడివాడ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్‌ నాయకత్వం అవసరమని.. జగన్‌ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు… అమ్మవారి ఆశీస్సుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని శత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి  మాజీ మంత్రి , టీడీపీ సీనియర్‌ నేత, ప్రస్తుత అప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు హాజరు అవడంతో టీడీపీలో కలకలం రేగింది.  జగన్‌ సీఎం కావాలని నాని చేస్తున్న యాగానికి టీడీపీ నేత అయి ఉండి […]

జగన్‌ కోసం యాగం... హాజరైన టీడీపీ పిన్నమనేని
X

గుడివాడ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్‌ నాయకత్వం అవసరమని.. జగన్‌ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు… అమ్మవారి ఆశీస్సుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని శత చండీయాగం నిర్వహిస్తున్నారు.

ఈ యాగానికి మాజీ మంత్రి , టీడీపీ సీనియర్‌ నేత, ప్రస్తుత అప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు హాజరు అవడంతో టీడీపీలో కలకలం రేగింది. జగన్‌ సీఎం కావాలని నాని చేస్తున్న యాగానికి టీడీపీ నేత అయి ఉండి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎలా వెళ్తారంటూ కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం చేస్తున్న యాగాన్ని రాజకీయం చేయవద్దని పిన్నమనేని విజ్ఞప్తి చేసినా టీడీపీ నేతలు మాత్రం చల్లారడం లేదు.

జగన్‌ బాగుండాలని చేస్తున్న యాగానికి వెళ్లి రాజకీయం చేయవద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొడాలినాని యాగానికి హాజరు అవడమే కాదు… టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా పిన్నమనేని డుమ్మా కొట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలితో కలిసి యాగాల్లో పాల్గొంటూ మరోవైపు కొడాలి నానిని ఓడించి టీడీపీని గెలిపిస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్‌ ముఖ్యమంత్రి కావాలంటూ కొడాలినాని చేస్తున్న యాగానికి టీడీపీ సీనియర్ నేత హాజరవడం ఆ పార్టీ వారికి మింగుడు పడడం లేదు.

First Published:  20 Oct 2018 1:17 AM GMT
Next Story