Telugu Global
NEWS

పవన్‌ కళ్యాణ్ పావలాకు తక్కువ " యామిని సాదినేని

ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన సాదినేని యామిని…. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రాష్ట్రంలో కవాతులు, ర్యాలీలు నిర్వహిస్తూ హింసను ప్రేరేపించేలా పవన్‌ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించడమే పవన్‌ కళ్యాణ్ ఉద్దేశమా అని నిలదీశారు. ఉద్దానంను ఉద్దరిస్తానని పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. పవన్‌కు […]

పవన్‌ కళ్యాణ్ పావలాకు తక్కువ  యామిని సాదినేని
X

ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన సాదినేని యామిని…. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రాష్ట్రంలో కవాతులు, ర్యాలీలు నిర్వహిస్తూ హింసను ప్రేరేపించేలా పవన్‌ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించడమే పవన్‌ కళ్యాణ్ ఉద్దేశమా అని నిలదీశారు.

ఉద్దానంను ఉద్దరిస్తానని పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. పవన్‌కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శించారు. పావలాకు కొరగాని పవన్‌ కళ్యాణా మంత్రి లోకేష్‌పై విమర్శలు చేసేది? అని యామిని ప్రశ్నించారు.

వారసత్వాల గురించి మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్…. చిత్రపరిశ్రమలో మెగా కుటుంబం నుంచే ఎనిమిది మంది హీరోలు ఉండడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తానంటున్న పవన్‌ కల్యాణ్…. మరి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడి హోదాను ఏ అర్హతతో తీసుకున్నారో చెప్పాలన్నారు.

జనంలోకి వెళ్లకుండా తప్పించుకునేందుకు భద్రతా కారణాలను సాకుగా చూపడం పవన్‌కు అలవాటైపోయిందన్నారు. జనసేన నిర్వహించిన కవాతుకు 38 కోట్లు ఖర్చు చేశారని…. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని పవన్‌ను డిమాండ్ చేశారు యామిని సాదినేని.

First Published:  17 Oct 2018 2:27 AM GMT
Next Story