Telugu Global
NEWS

లోకేష్ దెబ్బకు బాలకృష్ణ దారికొచ్చాడు

ఒకవైపు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎన్టీఆర్ ను రూపొందించుకుంటూ కూడా… హిందూపురం పర్యటనలను మాత్రం వరసగా పెట్టుకుంటున్నాడు బాలయ్య. ఇన్నాళ్లూ బాలయ్య హిందూపురాన్ని పెద్దగా పట్టించుకున్నదే లేదు. బాలయ్య కనపడుట లేదని మొదట్లోనే పోస్టర్లు వెలిశాయి. ఇక బాలయ్య నియోజకవర్గం సమస్యల మీద స్పందించకపోవడంతో భారీ ర్యాలీలు కూడా జరిగాయి. నిరసనలు జరిగాయి. చివరకు దున్నపోతు మీద బాలయ్య అని రాసి నిరసన తెలిపారు హిందూపురం జనాలు. ఇలా ఇన్నాళ్లూ నియోజకవర్గం వైపు చూళ్ళేదు ఈ నటసింహం. […]

లోకేష్ దెబ్బకు బాలకృష్ణ దారికొచ్చాడు
X

ఒకవైపు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎన్టీఆర్ ను రూపొందించుకుంటూ కూడా… హిందూపురం పర్యటనలను మాత్రం వరసగా పెట్టుకుంటున్నాడు బాలయ్య. ఇన్నాళ్లూ బాలయ్య హిందూపురాన్ని పెద్దగా పట్టించుకున్నదే లేదు. బాలయ్య కనపడుట లేదని మొదట్లోనే పోస్టర్లు వెలిశాయి.

ఇక బాలయ్య నియోజకవర్గం సమస్యల మీద స్పందించకపోవడంతో భారీ ర్యాలీలు కూడా జరిగాయి. నిరసనలు జరిగాయి. చివరకు దున్నపోతు మీద బాలయ్య అని రాసి నిరసన తెలిపారు హిందూపురం జనాలు.

ఇలా ఇన్నాళ్లూ నియోజకవర్గం వైపు చూళ్ళేదు ఈ నటసింహం. అప్పుడప్పుడు మాత్రం అక్కడకు వెళ్లి బైకులు నడిపి, ట్రాక్టర్లు నడిపి హడావుడి చేసేవాడు. తద్వారా మీడియాలో ఫొటోలు వేయించుకుని హిందూపురాన్ని తను ఉద్ధరించేస్తున్నట్టుగా పోజులు కొట్టేవాడు.

ఆ పోజులను ఇప్పుడు మరింతగా పెంచాడు బాలయ్య. వారం పది రోజులకు ఒకసారి హిందూపురంలో కనిపిస్తున్నాడు. ఏదో కొంత హడావుడి చేసి వస్తున్నాడు.

బాలయ్యలో ఏమిటీ మార్పు అంటే.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే సమాధానంతో పాటు… మరో సమాధానం కూడా వినిపిస్తోంది. హిందూపురం సీటు మీద బాలయ్య అల్లుడు లోకేష్ కన్నేశాడు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి హిందూపురాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాడట లోకేష్.

అయితే బాలయ్యకు ఆ నియోజకవర్గాన్ని వదలాలని లేదు. అయితే లోకేష్ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య చేసేది లేక నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

ఈ మధ్యనే తన ఓటును కూడా అక్కడకు మార్పించుకున్నాడు. తద్వారా హిందూపురం తనకు అని బాబు, లోకేష్ లకు అర్థమయ్యేలా చేయాలనేది బాలయ్య తాపత్రయంగా కనిపిస్తోంది.

First Published:  13 Oct 2018 6:30 AM GMT
Next Story