Telugu Global
NEWS

తిన్నంత తిండి.... కావాల్సినంత మందు పోస్తే ఎవరైనా బాగుందంటారు....

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌, సీఎం చంద్రబాబుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్…. తాను అందరిలాంటి వాడిని కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం గొడవ చేయాలంటే తానొక్కడినే చేయాలని…. ఆ శక్తి తనకు మాత్రమే ఉందని పవన్‌ కల్యాణ్ ప్రకటించుకున్నారు. తొలుత మోడీని నిలదీసింది తానేనని పవన్ చెప్పారు. టీడీపీ నేతలు తనను మోడీ దత్తపుత్రుడు అంటున్నారని…. కానీ తాను ఎవరికీ […]

తిన్నంత తిండి.... కావాల్సినంత మందు పోస్తే ఎవరైనా బాగుందంటారు....
X

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌, సీఎం చంద్రబాబుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్…. తాను అందరిలాంటి వాడిని కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం గొడవ చేయాలంటే తానొక్కడినే చేయాలని…. ఆ శక్తి తనకు మాత్రమే ఉందని పవన్‌ కల్యాణ్ ప్రకటించుకున్నారు. తొలుత మోడీని నిలదీసింది తానేనని పవన్ చెప్పారు.

టీడీపీ నేతలు తనను మోడీ దత్తపుత్రుడు అంటున్నారని…. కానీ తాను ఎవరికీ దత్తపుత్రుడను కాదన్నారు. ”మోడీతో గొడవపెట్టుకున్న వాడిని నేనే…. నేనంటే భయం” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీతో కరచాలనం చేస్తున్నప్పుడు చంద్రబాబు కళ్లలో ఎంతో ప్రేమ, ఎంతో వినయం కనిపించిందన్నారు.

ఎక్కడో ఐటీ సోదాలు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రోజూ వందల మందిని తీసుకొస్తున్నారని…. కానీ అక్కడ చూడ్డానికి ఏముందని ప్రశ్నించారు. వచ్చిన వాడికి తిన్నంత తిండి.. కావాల్సినంత మందు పోస్తే ఎవరైనా అంతా బాగానే ఉందంటారని పవన్ ఎద్దేవా చేశారు. జగన్‌ లాగా పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టడానికి తాను రాలేదన్నారు. నిర్వాసితుల కష్టాలు తెలుసుకుని వారి పక్కన నిలబడడానికి వచ్చానన్నారు.

First Published:  9 Oct 2018 11:35 PM GMT
Next Story