Telugu Global
NEWS

కొమ్మినేనికి జగన్‌ ఫోన్

సీనియర్ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు శ్రీహర్ష కన్నుమూశారు. రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న 32 ఏళ్ల శ్రీహర్ష సోమవారం కన్నుమూశారు. కెనడాలో ఉద్యోగం చేస్తున్న శ్రీహర్షకు భార్య, కుమార్తె ఉన్నారు. శ్రీహర్ష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజల క్రితమే కొమ్మినేని దంపతులు కొడుకు దగ్గరకు వెళ్లారు. ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి మీడియా కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. కొమ్మినేని కుమారుడి మరణం విషయం తెలుసుకున్న జగన్ ఫోన్‌లో పరామర్శించారు. […]

కొమ్మినేనికి జగన్‌ ఫోన్
X

సీనియర్ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు శ్రీహర్ష కన్నుమూశారు. రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న 32 ఏళ్ల శ్రీహర్ష సోమవారం కన్నుమూశారు.

కెనడాలో ఉద్యోగం చేస్తున్న శ్రీహర్షకు భార్య, కుమార్తె ఉన్నారు. శ్రీహర్ష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజల క్రితమే కొమ్మినేని దంపతులు కొడుకు దగ్గరకు వెళ్లారు. ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి మీడియా కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నారు.

కొమ్మినేని కుమారుడి మరణం విషయం తెలుసుకున్న జగన్ ఫోన్‌లో పరామర్శించారు. కొమ్మినేని దంపతులను ఓదార్చారు. శ్రీహర్ష ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కొమ్మినేనికి శ్రీహర్ష ఒక్కడే కుమారుడు.

First Published:  9 Oct 2018 5:57 AM GMT
Next Story