Telugu Global
NEWS

ఆ విషయం రాహుల్‌కే చెప్పి వచ్చాం....

కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో టికెట్ల వివాదం నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన కొండా దంపతులు రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని కొండా సురేఖ విమర్శించారు. తమ లాంటి వారు పార్టీలో ఉంటే కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే బయటకు పంపించారన్నారు. తాము రెండు, మూడు సీట్లు అడిగామన్న […]

ఆ విషయం రాహుల్‌కే చెప్పి వచ్చాం....
X

కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో టికెట్ల వివాదం నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన కొండా దంపతులు రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని కొండా సురేఖ విమర్శించారు. తమ లాంటి వారు పార్టీలో ఉంటే కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే బయటకు పంపించారన్నారు. తాము రెండు, మూడు సీట్లు అడిగామన్న దాంట్లో నిజం లేదన్నారు. అదంతా తప్పుడు ప్రచారమన్నారు.

తమ ప్రభావం ఎలా ఉంటుందో ఈ క్షణం నుంచే కేసీఆర్‌ చూస్తారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో ఐదారు సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తీసుకొస్తామని రాహుల్‌ గాంధీకి చెప్పి వచ్చామన్నారు. అన్నట్టుగానే చేసి చూపిస్తామన్నారు కొండా సురేఖ.

అయితే కాంగ్రెస్‌ నుంచి కొండా కుటుంబానికి ఒక అసెంబ్లీ సీటుకు మాత్రమే హామీ వచ్చినట్టు చెబుతున్నారు.

First Published:  26 Sep 2018 4:35 AM GMT
Next Story