Telugu Global
NEWS

రోజా పై అసభ్య వ్యాఖ్యలు.‌... బోడెపై కేసుకు హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రోజా బ్రోతల్‌ హౌజ్‌ నడుపుతోందని చెప్పినా జనం నమ్ముతారంటూ టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆ మధ్య అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తనను పదేపదే కాల్‌మనీ ఎమ్మెల్యే అంటున్నారని…. మరోసారి అలా అంటే రోజాను చెప్పులతో కొట్టిస్తానని హెచ్చరించారు. రోజా వస్తే కోడిగుడ్లతో కొడుతాం అంటూ… ఇంకా అనేక అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బోడే ప్రసాద వ్యాఖ్యలపై రోజా అప్పట్లో […]

రోజా పై అసభ్య వ్యాఖ్యలు.‌... బోడెపై కేసుకు హైకోర్టు ఆదేశం
X

ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రోజా బ్రోతల్‌ హౌజ్‌ నడుపుతోందని చెప్పినా జనం నమ్ముతారంటూ టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆ మధ్య అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తనను పదేపదే కాల్‌మనీ ఎమ్మెల్యే అంటున్నారని…. మరోసారి అలా అంటే రోజాను చెప్పులతో కొట్టిస్తానని హెచ్చరించారు.

రోజా వస్తే కోడిగుడ్లతో కొడుతాం అంటూ… ఇంకా అనేక అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బోడే ప్రసాద వ్యాఖ్యలపై రోజా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రోజా ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు స్వీకరించలేదు. బోడె ప్రసాద్‌ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో సాక్ష్యాలు చూపినా కేసు నమోదుకు అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

బోడె ప్రసాద్‌ తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆశ్చర్యపోయింది. వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై రోజా తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

First Published:  18 Sep 2018 1:35 AM GMT
Next Story