Telugu Global
NEWS

పండుగ పూట చౌరస్తాలో ఎమ్మెల్యే బైఠాయింపు

నయీం అంశం తెలంగాణ రాజకీయాలను వదిలిపెట్టడం లేదు. నయీంతో లింకులను నేతలే బయటపెట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషర్‌ రెడ్డి మధ్య నయీం అంశం నిప్పురాజేసింది. మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని మల్ రెడ్డి ఆరోపించడంతో వివాదం రేగింది. నయీంతో కలిసి మంచిరెడ్డి దందాలు చేశారని మల్ రెడ్డి ఆరోపించారు. నయీం దాచిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని చెప్పారు. దీనిపై మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మల్ రెడ్డి […]

పండుగ పూట చౌరస్తాలో ఎమ్మెల్యే బైఠాయింపు
X

నయీం అంశం తెలంగాణ రాజకీయాలను వదిలిపెట్టడం లేదు. నయీంతో లింకులను నేతలే బయటపెట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషర్‌ రెడ్డి మధ్య నయీం అంశం నిప్పురాజేసింది. మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని మల్ రెడ్డి ఆరోపించడంతో వివాదం రేగింది. నయీంతో కలిసి మంచిరెడ్డి దందాలు చేశారని మల్ రెడ్డి ఆరోపించారు. నయీం దాచిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని చెప్పారు. దీనిపై మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మల్ రెడ్డి ఆరోపణలకు వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మంచిరెడ్డి బైఠాయించారు. తాను రెండు గంటల పాటు ఇక్కడే ఉంటానని దమ్ముంటే మల్ రెడ్డి వచ్చి తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Click on Image to Read:

kodela shiva rama krishna 1

dubagunta rosamma

purandeswari1

tulasi reddy

sujana satyam rama linga raju

jairam ramesh

pawan

ysrcp mla

cbn sakshi media acb

First Published:  5 Sep 2016 3:06 AM GMT
Next Story