మోహన్ రెడ్డి అరెస్టయ్యాడా? లొంగిపోయాడా?
వడ్డీపేరుతో పలువురి ఆస్తులు లాక్కున్నాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ఏఎస్ ఐ మోహన్ రెడ్డిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు మోహన్ రెడ్డిని అరెస్టు చేశారా? అతనే లొంగిపోయాడా అన్న విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందర గోళానికికారణం. చాడా నారాయణ రెడ్డి అనే వ్యక్తి రెండువారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను కూడా మోహన్ రెడ్డి వద్ద అప్పు తీసుకుని రెండెకరాల భూమి కోల్పోయాడని సమాచారం. ఏఎస్సై […]
BY sarvi22 Aug 2016 10:08 PM GMT
X
sarvi Updated On: 23 Aug 2016 1:10 AM GMT
వడ్డీపేరుతో పలువురి ఆస్తులు లాక్కున్నాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ఏఎస్ ఐ మోహన్ రెడ్డిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు మోహన్ రెడ్డిని అరెస్టు చేశారా? అతనే లొంగిపోయాడా అన్న విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందర గోళానికికారణం. చాడా నారాయణ రెడ్డి అనే వ్యక్తి రెండువారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను కూడా మోహన్ రెడ్డి వద్ద అప్పు తీసుకుని రెండెకరాల భూమి కోల్పోయాడని సమాచారం. ఏఎస్సై మోహన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి ల వేధింపుల కారణంగానే చనిపోతున్నా అంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాని తరువాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారాయణ రెడ్డి కూతురు మళ్లీ ఠాణాకు వచ్చి తన తండ్రి చావుకు కారణం మోహన్ రెడ్డి కాదని చెప్పడంతో అంతా విస్తుపోయారు. దీనికితోడు మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి నారాయణరెడ్డి ఎవరో కూడా తెలియదన్నాడు.
నయీం ఎన్ కౌంటర్ తరువాత మోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో మోహన్ రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు ముస్కు మహేందర్ రెడ్డి కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశాడు. మోహన్ రెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరూ కలిసి కరీంనగర్లో పలు భూ దందాలు చేశారని ఆరోపించాడు. మోహన్ రెడ్డి ఆగడాలు భరించలేక కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు (ఈయన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు బంధువు) ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆయన్ని తుపాకీతో కొందరు వ్యక్తులు బెదిరించారని, వారు నయీం మనుషులేనని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రెండు విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నారాయణ రెడ్డి ఆత్మహత్య కేసులో మోహన్ రెడ్డి ఎస్పీ ఆఫీసులో లొంగిపోయాడని ఒక కథనం. నయీంతో మోహన్ రెడ్డికి లింకులున్నాయన్న ఆరోపణలతోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్నది రెండో కథనం. వీటిలో ఏది నిజమో పోలీసులే వెల్లడించాలి.
Next Story