Telugu Global
NEWS

సైకిల్‌పై తిరిగి మీడియా అధినేత అయ్యాడు... నేను వృద్ధాశ్రమంలో ఉంటున్నా...

అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన తనను సీఎం చంద్రబాబు ఉన్మాది అనడంపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఉన్మాది అన్న వ్యక్తే ఉన్మాది అని వ్యాఖ్యానించారు. తాను రాజధానికి వ్యతిరేకం కాదని… కానీ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ముందుకెళ్తున్న తీరుపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. కార్పొరేట్ వ్యక్తులను కమిటీగా వేసి ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఏబీకే విమర్శించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం […]

సైకిల్‌పై తిరిగి మీడియా అధినేత అయ్యాడు... నేను వృద్ధాశ్రమంలో ఉంటున్నా...
X

అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన తనను సీఎం చంద్రబాబు ఉన్మాది అనడంపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఉన్మాది అన్న వ్యక్తే ఉన్మాది అని వ్యాఖ్యానించారు. తాను రాజధానికి వ్యతిరేకం కాదని… కానీ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ముందుకెళ్తున్న తీరుపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. కార్పొరేట్ వ్యక్తులను కమిటీగా వేసి ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఏబీకే విమర్శించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్‌ విషయంలో ఏం జరిగిందో అదే పొరపాటు ఇప్పుడు చేస్తున్నారని అన్నారు. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా వద్దా అన్న దశలో పెద్దగా ఖర్చు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పిటిషన్‌ వేసినందుకు అయిన 10వేల రూపాయల ఖర్చును సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ భరించారని చెప్పారు. సుప్రీం తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్తామన్నారు.

ఏబీకే సాక్షిలో పనిచేసే ఉద్యోగి అంటూ ఒక మీడియా సంస్థ ప్రచారం చేయడంపైనా ఏబీకే స్పందించారు. తాను సాక్షి ఉద్యోగిని కాదన్నారు. వారం వారం రాసే వ్యాసాలకు ఇచ్చే గౌరవవేతనం తప్ప ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయ వనరు లేదన్నారు. నా జీవితం తెలిసిన వారందరికీ తానంటే ఏంటో తెలుసన్నారు. నా మీద ఆరోపణలు చేసిన వాళ్లలో ఒకతను… ఒకప్పుడు సైకిల్ మీద వచ్చిపోతూ తన కింద పనిచేసిన వ్యక్తేనని ఏబీకే అన్నారు. ఇప్పుడు ఒక మీడియా సంస్థకు అధిపతి అయ్యారని ఇది కూడా చర్చించాల్సిన అంశమేనన్నారు. సదరు మీడియా అధిపతి లేనిది సంపాదించుకున్నారని… తాను ఉన్నది పోగొట్టుకున్నానని ఏబీకే చెప్పారు. జర్నలిస్ట్ కాలనీలో ఇంటిని కూడా అమ్ముకుని కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్న చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో 15ఏళ్లుగా ఉంటున్నానని ఏబీకే వివరించారు.

Click on Image to Read:

nayeem shivananda reddy

rama subba reddy vs adinarayana reddy

ysrcp

chandrababu sakshi

chandrababu naidu

si ramakrishna reddy

cbn

Uma Madhava Reddy 1

komati-reddy-rajagopal-redd

ysrcp leader

babu murder case

mohan babu

payyavula keshav

ias sri lakshmi

ap bc sangam president uday bhaskar

madhu yashki

heart attack

First Published:  16 Aug 2016 8:34 PM GMT
Next Story