ఎన్నికల్లో నష్టనివారణకే మోడీ దళిత జపం: విపక్షాలు
రాబోయే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ దళిత జపం చేస్తున్నారని బిఎస్పీ, ఎస్సీ, కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. దళితులను తమ ప్రభుత్వం రక్షిస్తుందని మోడీ చెప్పడం పచ్చి అబద్ధమని ఆ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు సంవత్సరాలుగా అనేక దాడులు జరిగినా ప్రధాని ఏ కారణం చేత మౌనంగా ఉన్నారని ఆ పార్టీల నేతలు మోడీని నిలదీశారు. […]
BY sarvi8 Aug 2016 9:20 AM GMT
X
sarvi Updated On: 9 Aug 2016 12:39 AM GMT
రాబోయే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ దళిత జపం చేస్తున్నారని బిఎస్పీ, ఎస్సీ, కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. దళితులను తమ ప్రభుత్వం రక్షిస్తుందని మోడీ చెప్పడం పచ్చి అబద్ధమని ఆ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు సంవత్సరాలుగా అనేక దాడులు జరిగినా ప్రధాని ఏ కారణం చేత మౌనంగా ఉన్నారని ఆ పార్టీల నేతలు మోడీని నిలదీశారు. నష్టనివారణ కోసమే మోడీ దళితులపై జరిగిన దాడులను ఖండించారని ఆ పార్టీల నేతలు వివరించారు. మోడీ శని ఆదివారాల్లో జరిగిన రెండు సమావేశాల్లో దళితులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. ఢిల్లీలోని టౌన్ మీటింగ్లో, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బీజేపీ మహాసమ్మేళన్ సమావేశంలో మోడీ ఈ అంశంపై మాట్లాడిన విషయం విదితమే. హైదరాబాద్ సమావేశంలో మోడీ మాట్లాడుతూ గోరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానని, దళితులకు బదులుగా తనను కాల్చాలని మోడీ అన్నారు.
మోడీ వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ ఎన్నికల కోసమే మోడీ దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై జరిగిన దాడులను మాయావతి ప్రస్తావించారు. దళితులపై మోడీకి ఎలాంటి ప్రేమలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల కోసమే ప్రధాని దళిత అంశాన్ని లేవనెత్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. దళితులకు బదులుగా తనను కాల్చాలని మోడీ చేసిన ప్రకటన ఆయనలోని బలహీనతను వెల్లడి చేసిందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోడీ ఎన్ని మాయ మాటలు మాట్లాడినా 2017లో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అంత తేలికైన విషయం కాదని విపక్షాల నేతలు చెప్పారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Next Story