Telugu Global
NEWS

వ్యాస్‌ , పటోళ్ల హంతకుడు నయూమ్‌ ఎన్‌కౌంటర్

మోస్ట్‌ వాంటెండ్‌ గ్యాంగ్‌ స్టర్ నయూమ్‌ ఎన్ కౌంటర్ అయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కాల్చిచంపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్‌ శివారులో తలదాచుకుంటున్న నయూమ్‌ను ఉదయం గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టి మట్టుపెట్టాయి. నయూమ్‌ ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన ఐపీఎస్ వ్యాస్‌ హత్య కేసులో, లాయర్ పురుషోత్తం హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. బెల్లి లలితా హత్య కేసుతో నయూమ్ అంటే అన్ని వర్గాల్లో భయం ఏర్పడింది.  అనంతరం మావోయిస్ట్ గ్రూప్‌ నుంచి బయటకు వచ్చిన […]

వ్యాస్‌ , పటోళ్ల హంతకుడు నయూమ్‌ ఎన్‌కౌంటర్
X

మోస్ట్‌ వాంటెండ్‌ గ్యాంగ్‌ స్టర్ నయూమ్‌ ఎన్ కౌంటర్ అయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కాల్చిచంపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్‌ శివారులో తలదాచుకుంటున్న నయూమ్‌ను ఉదయం గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టి మట్టుపెట్టాయి. నయూమ్‌ ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన ఐపీఎస్ వ్యాస్‌ హత్య కేసులో, లాయర్ పురుషోత్తం హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. బెల్లి లలితా హత్య కేసుతో నయూమ్ అంటే అన్ని వర్గాల్లో భయం ఏర్పడింది. అనంతరం మావోయిస్ట్ గ్రూప్‌ నుంచి బయటకు వచ్చిన నయూమ్ సొంతంగా గ్యాంగ్‌ను స్థాపించి అనేక హత్యలకు పాల్పడ్డాడు.

మాజీ మావోయిస్టులు, టీఆర్‌ఎస్ నేత సాంబశివుడు, రాములుతో పాటు పరిటాల రవి హత్య కేసులో ప్రస్తావనకు వచ్చిన పటోళ్ల గోవర్దన్ రెడ్డిని కూడా నయూమ్‌ గ్యాంగే హత్య చేసింది. నయూమ్ స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరి. హత్యలతో పాటు భూదందాలు, సెటిల్మెంట్లు వంటి 100కు పైగా కేసులు నయూమ్‌పై ఉన్నాయి. కొంతకాలంగా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో తలదాచుకుంటున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. గ్రేహౌండ్స్, సీఐఎస్‌ఎఫ్ సాయంతో మట్టుపెట్టారు.

Click on Image to Read:

ap ministers

ys jagan

ys-jagan-2

sunitha

kcr

kcr speach

mahatma statue

kcr

mla kurugodla ramakrishna

ramoji rao

jc diwakar reddy

by ramaiah

pawan-kalyan

pranab-chandrababu-naidu

First Published:  8 Aug 2016 12:04 AM GMT
Next Story