భార్యాపిల్లలను కార్లో ఉంచి...నిప్పంటించాడు!
ఈ దారుణమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు కార్లో ఉండగా, భార్యకు నిప్పుపెట్టాడు. భార్య మరణించగా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే….నాగరాజన్, అతని భార్య ప్రేమ (28) ఇద్దరు పిల్లలతో పాటు మారుతి స్విఫ్ట్ కారులో తెయనంపేట్ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో వారిమధ్య ఏదో విషయం మీద వాగ్వివాదం మొదలైంది. అది శ్రుతిమించడంతో ప్రేమ… కారులో ఉన్న పెట్రోలు డబ్బాని తీసుకుని తనమీద ఒంపుకుంది. కారులో ముందుజాగ్రత్తగా ఉంచుకున్న […]
ఈ దారుణమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు కార్లో ఉండగా, భార్యకు నిప్పుపెట్టాడు. భార్య మరణించగా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే….నాగరాజన్, అతని భార్య ప్రేమ (28) ఇద్దరు పిల్లలతో పాటు మారుతి స్విఫ్ట్ కారులో తెయనంపేట్ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో వారిమధ్య ఏదో విషయం మీద వాగ్వివాదం మొదలైంది. అది శ్రుతిమించడంతో ప్రేమ… కారులో ఉన్న పెట్రోలు డబ్బాని తీసుకుని తనమీద ఒంపుకుంది.
కారులో ముందుజాగ్రత్తగా ఉంచుకున్న పెట్రోలు అది. అయితే ప్రేమ తనపై పెట్రోలు ఒంపుకోగానే నాగరాజన్ కారుని ఆపి, అగ్గిపుల్ల వెలిగించి ఆమెపై వేసి తాను దిగిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో మ్రాన్సడిపోయిన ప్రేమ… తన ఇద్దరు పిల్లలను కారు బయటకు విసిరేసింది. అయితే ఆమె తననితాను కాపాడుకోలేకపోయింది. ఆమె శరీరం తీవ్రంగా కాలి.. గాయాల పాలైంది. చెన్నైలోని సైదాపేట్ వద్ద ఈ ఘటన జరగ్గా దారినపోయేవాళ్లు స్పందించి ప్రేమను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కిల్పాక్ మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆమె ప్రాణాలు వదిలింది.
తనకు భర్తే నిప్పు పెట్టినట్టుగా ప్రేమ మరణ వాంగ్మూలంలో వెల్లడించింది. తాను కేవలం బెదిరించడానికే పెట్రోలు పోసుకున్నానని కూడా ఆమె తెలిపింది. ఆమె నాలుగేళ్ల కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రేమ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నాగరాజన్ని హత్యానేరంపై అరెస్టు చేశారు.