బాలికపై అత్యాచారం...సోషల్మీడియాలో వీడియో!
దళిత బాలికపై అత్యాచారం చేసి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాల్లియా జిల్లా సాదర్ కొత్వాలీ అనే ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పడింది. బాలిక తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు బాలికని తన బంధువులు ఉంటున్న ఘాజిపూర్కి తీసుకువెళ్లాడు. అక్కడ అతను ఆమెపై అత్యాచారం చేసి దాన్ని […]
దళిత బాలికపై అత్యాచారం చేసి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాల్లియా జిల్లా సాదర్ కొత్వాలీ అనే ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పడింది. బాలిక తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు బాలికని తన బంధువులు ఉంటున్న ఘాజిపూర్కి తీసుకువెళ్లాడు. అక్కడ అతను ఆమెపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీశాడు. తరువాత ఆ యువకుడు తన స్నేహితులతో కూడా శారీరక సంబంధం కొనసాగించాల్సిందిగా బాలికపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోతే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదరించాడు. ఆమె ఒప్పుకోక పోవటంతో అతను వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.
యువకుడు బాలికపై అత్యాచారం జరిపి దాదాపు ఆరునెలలు కావస్తుండగా…వీడియో వైరల్ అయిన తరువాత గురువారం ఆమె తల్లిదండ్రులు నిందితులపై కేసు పెట్టారు. బాలిక తల్లిదండ్రులు పెట్టిన కేసుని బట్టి పోలీసులు ఇద్దరు యువకులకోసం గాలిస్తున్నారు. వారు ఆరు నెలలుగా ఊళ్లో లేరని పోలీసుల దర్యాప్తులో తేలింది.