15 రూపాయల అప్పు...ఓ జంట ప్రాణాలు తీసింది!
రాజకీయ నేతల మాటల్లో…. అభివృద్ధిలో పరుగులు తీస్తున్న మన భారత్లో 15 రూపాయల అప్పు కూడా…ప్రాణాలు తీస్తుందని ఈ సంఘటన రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత జంట… అశోక్ మిశ్రా అనే వ్యక్తికి చెందిన కిరాణాకొట్టులో కొన్నాళ్ల క్రితం ఓ బిస్కెట్ ప్యాకెట్ని అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పుని వారు తీర్చలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ భార్యాభర్తలు పనికి బయలుదేరుతుండగా అశోక్ మిశ్రా వారిని అడ్డగించాడు. తన […]
రాజకీయ నేతల మాటల్లో…. అభివృద్ధిలో పరుగులు తీస్తున్న మన భారత్లో 15 రూపాయల అప్పు కూడా…ప్రాణాలు తీస్తుందని ఈ సంఘటన రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత జంట… అశోక్ మిశ్రా అనే వ్యక్తికి చెందిన కిరాణాకొట్టులో కొన్నాళ్ల క్రితం ఓ బిస్కెట్ ప్యాకెట్ని అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పుని వారు తీర్చలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ భార్యాభర్తలు పనికి బయలుదేరుతుండగా అశోక్ మిశ్రా వారిని అడ్డగించాడు. తన బాకీ తీర్చాలని పట్టుపట్టాడు. తమ వద్ద డబ్బులేదని ఇంకాస్త గడువు కావాలని వారు కోరారు. దాంతో వారితో గొడవ పెంచుతున్న మిశ్రా, ఆగ్రహంతో ఊగిపోతూ…ఆ ప్రాంతంలో కనిపించిన గొడ్డలితో వారిపై దాడిచేశాడు. వెనుకాముందు ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టుగా నరికేసి తీవ్రంగా గాయపరచాడు. దాంతో భార్యాభర్తలిద్దదూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అశోక్మిశ్రాని అరెస్టు చేశారు.