ఇద్దరు పెళ్లాలు...పోషణకు బైక్ల దొంగతనం!
అతనికి ఇద్దరు పెళ్లాలు…రెండు ఇళ్లు. చేస్తున్నది కూలి పని. రెండు కుటుంబాలను పోషించడానికి అదనపు డబ్బు కావాలసి వచ్చింది. దాంతో టూ వీలర్ల దొంగతనాలు మొదలుపెట్టాడు. పోలీసుల మాటల్లో చెప్పాలంటే 32 ఏళ్ల మురళీ రామారావు వెహికల్స్ దొంగతనాన్ని తన రెండవ వృత్తిగా చేసుకున్నాడు. బెంగలూరు నగరంలో పలు ప్రాంతాల్లో బైక్లను దొంగతనం చేసిన మురళి, భార్యల దగ్గరకు వెళ్లేటపప్పుడు సిటీబస్లో వెళ్లేవాడు. తిరిగి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక బైక్ని దొంగతనం చేసేవాడు. భార్యలను వాటిమీద […]
అతనికి ఇద్దరు పెళ్లాలు…రెండు ఇళ్లు. చేస్తున్నది కూలి పని. రెండు కుటుంబాలను పోషించడానికి అదనపు డబ్బు కావాలసి వచ్చింది. దాంతో టూ వీలర్ల దొంగతనాలు మొదలుపెట్టాడు. పోలీసుల మాటల్లో చెప్పాలంటే 32 ఏళ్ల మురళీ రామారావు వెహికల్స్ దొంగతనాన్ని తన రెండవ వృత్తిగా చేసుకున్నాడు. బెంగలూరు నగరంలో పలు ప్రాంతాల్లో బైక్లను దొంగతనం చేసిన మురళి, భార్యల దగ్గరకు వెళ్లేటపప్పుడు సిటీబస్లో వెళ్లేవాడు. తిరిగి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక బైక్ని దొంగతనం చేసేవాడు. భార్యలను వాటిమీద తిప్పేవాడు. దీన్ని ఒక ఆనవాయితీగా చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఒక హోటల్ ముందున్న బండిని దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికి పోయారు.
అతని నుండి దాదాపు 25 టూవీలర్స్ని అమ్మిన సొమ్ము 15 లక్షల రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ల దొంగతనం తప్ప తన కుటుంబాలను పోషించుకోవడానికి తనకు వేరే మార్గమేదీ దొరకలేదని అతను పోలీసులతో చెప్పాడు. ఇన్ని రకాల బైక్లు ఎక్కడివని భార్యలు అడిగితే స్నేహితులవని చెప్పేవాడు. అతను బెంగలూరులో పదకొండు ఏరియాల్లో బైకుల దొంగతనాలు చేశాడు. టూ వీలర్ల దొంగతనానికి అతను డూప్లికేట్ తాళాలను ఉపయోగించేవాడు. దొంగిలించిన వాటిని స్నేహితులకు తిరగడానికి ఇచ్చేవాడు. ఆపై వాటిని అమ్మేసేవాడు. పోలీసులు మురళీ రామారావుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.