షేర్ మార్కెట్లో నష్టాలు...ఉన్మాదంలో భార్యని చంపి నరికి ముక్కలు చేశాడు!
మగవారి క్రూరత్వానికి బలైపోతున్న మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆర్థిక నష్టాలతో మొదలైన గొడవలు తీవ్రం కావటంతో…ఆ కారణాన్ని అడ్డుపెట్టుకుని భార్యను చంపి ముక్కలుగా నరికాడు ఒక దుర్మార్గపు భర్త. అంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి, తరువాత వ్యాపారిగా మారాడు రూపేష్ అనే వ్యక్తి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చాయి. ఆ ఫ్రస్టేషన్ని కట్టుకున్న భార్యమీద చూపించేవాడు. దాంతో ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతుండేవి. చివరికి ఆమెని హత్య చేశాడు. శవాన్ని ముక్కలుగా […]
మగవారి క్రూరత్వానికి బలైపోతున్న మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆర్థిక నష్టాలతో మొదలైన గొడవలు తీవ్రం కావటంతో…ఆ కారణాన్ని అడ్డుపెట్టుకుని భార్యను చంపి ముక్కలుగా నరికాడు ఒక దుర్మార్గపు భర్త. అంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి, తరువాత వ్యాపారిగా మారాడు రూపేష్ అనే వ్యక్తి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చాయి. ఆ ఫ్రస్టేషన్ని కట్టుకున్న భార్యమీద చూపించేవాడు. దాంతో ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతుండేవి. చివరికి ఆమెని హత్య చేశాడు. శవాన్ని ముక్కలుగా చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపల్లి గ్రామ శివార్లకు కారులో తీసుకుని వెళ్లి పెట్రోలు పోసి తగుల బెట్టాడు. అనంతరం అతను పారిపోతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.
పోలీసుల విచారణలో తేలిన నిజాలను బట్టి రూపేష్ 1994లో ఆఫ్రికాకు వెళ్లాడు. తిరిగి వచ్చాక 2008లో సింధియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఇండియాకు వచ్చాక రూపేష్ కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. దాన్ని మానేసి వ్యాపారంలోకి దిగాడు. షేర్ మార్కెట్లో డబ్బుపెడితే నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా గొడవలు చాలా తీవ్రంగా వస్తుండేవి. వీరికి ఇంతకుముందు చాలాసార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కలిసి ఉండమని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. అయితే ఆ ప్రయత్నాలేమీ ఫలించపోవటంతో గొడవలు అలాగే ఉండటంతో రూపేష్ సింధియాని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి ఆమె గొంతునులిమి హత్య చేశాడు. సోమవారం మధ్యాహ్నం భార్య శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆ శరీర భాగాలకు సూట్కేసులో పెట్టుకుని మదనపల్లి గ్రామ శివార్లకు చేరాడు. అక్కడ సూట్కేసుకుని బయటకు తీసి పెట్రోలు పోసి తగులబెట్టాడు. కొంతమంది గ్రామస్తులు గమనించినా ముందు పట్టించుకోలేదు. అయితే అతను కారులో చాలా వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు కారుని అడ్డగించారు. అప్పటికే కారు బురదలో ఇరుక్కుపోవటంతో అతను వారికి దొరికిపోయాడు. రూపేష్ కారులో తనతోపాటు కూతురిని కూడా తీసుకువచ్చినట్టుగా గ్రామస్తులు తెలిపారు. తన తల్లిని తండ్రి రోజూ బాధపట్టేవాడని, ఆ చిన్నారి ఏడుస్తూ పోలీసులకు తెలిపింది. రూపేష్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు.