దేవతా పాముని చంపుతావా అంటూ… తోటి మనిషిని చంపేశారు!
ఇంట్లోకి పాము రాగానే ఎవరైనా దాని బారిన పడకుండా తమని తాము కాపాడుకోవాలనే అనుకుంటారు. అతను కూడా అదే అనుకున్నాడు. రెండు దెబ్బలు వేయగానే అది చనిపోయింది. ఇది తెలిసి పక్కింటి వాళ్లు అతనిపై గొడవకు వచ్చారు. అది తాము పూజలు చేస్తున్న పామని, అలాంటి దేవతా పాముని చంపుతావా అంటూ అతనిపై దాడిచేసి చావబాదారు. పాముని చంపిన వ్యక్తి దళితుడు కాగా, అతడిని చంపినవారు అగ్రకులాలకు చెందినవారు కావటం గమనార్హం. మధ్య ప్రదేశ్లోని మురైనా జిల్లాలో […]
ఇంట్లోకి పాము రాగానే ఎవరైనా దాని బారిన పడకుండా తమని తాము కాపాడుకోవాలనే అనుకుంటారు. అతను కూడా అదే అనుకున్నాడు. రెండు దెబ్బలు వేయగానే అది చనిపోయింది. ఇది తెలిసి పక్కింటి వాళ్లు అతనిపై గొడవకు వచ్చారు. అది తాము పూజలు చేస్తున్న పామని, అలాంటి దేవతా పాముని చంపుతావా అంటూ అతనిపై దాడిచేసి చావబాదారు. పాముని చంపిన వ్యక్తి దళితుడు కాగా, అతడిని చంపినవారు అగ్రకులాలకు చెందినవారు కావటం గమనార్హం.
మధ్య ప్రదేశ్లోని మురైనా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి దళిత యువ న్యాయవాది జాదవ్ సిన్హా. అతనిపై దాడికి పాల్పడిన పక్కింటి వ్యక్తులు బంటి, భురా. వీరితో పాటు మరికొంతమంది కూడా కలిసి జాదవ్ని విపరీతంగా కొట్టారు. తీవ్రంగా గాయాల పాలైన జాదవ్ని ఆసుపత్రికి తరలించగా అతను చికిత్స పొదుతూ మృతి చెందాడు. జాదవ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ వెంటనే వదిలేశారు. చివరికి జాదవ్ తరపువారు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పదిమందిపై కేసులు నమోదు చేశారు.