అన్న మరణం...మండుతున్న చితిలోకి దూకి చెల్లి ఆత్మహత్య!
రాజస్థాన్లోని డుంగర్పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న దుర్గ (28) అనే మహిళ మూడేళ్లుగా తన అన్న వేలారాం మనత్ (35) ఇంట్లోనే ఉంటున్నది. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా గురువారం రాత్రి వేలారాం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అన్న మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన దుర్గ, అన్న అంత్యక్రియల అనంతరం అందరూ ఇంటికి తిరిగి వచ్చాక, ఆ ప్రదేశానికి వెళ్లింది. మండుతున్న అన్న చితిలోకి దూకి ఆత్మహత్యకు […]
రాజస్థాన్లోని డుంగర్పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న దుర్గ (28) అనే మహిళ మూడేళ్లుగా తన అన్న వేలారాం మనత్ (35) ఇంట్లోనే ఉంటున్నది. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా గురువారం రాత్రి వేలారాం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అన్న మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన దుర్గ, అన్న అంత్యక్రియల అనంతరం అందరూ ఇంటికి తిరిగి వచ్చాక, ఆ ప్రదేశానికి వెళ్లింది. మండుతున్న అన్న చితిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి ఆమె కుటుంబానికి సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమె మరణించింది. అనంతరం ఆమె మృత దేహానికి ఆ పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.