నడిరోడ్డుమీద నరికి చంపారు...పోలీసులకోసం ఎదురుచూశారు!
పాత కక్షలను మనసులో పెట్టుకుని ముగ్గురు వ్యక్తులను నరికి చంపిన ఘటన ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, చెన్నుంబొట్ల అగ్రహారంలో చోటుచేసుకుంది. అగ్రహారం ఎస్సీ కాలసీకి చెందిన దిడ్ల శాంసన్, బోస్ అనే తండ్రీ కొడుకులకు, కీర్తిపాటి రత్తయ్య ఆయన కుమారుడు మేరిబాబుకు 2014లో చిన్నపిల్లల విషయంలో గొడవ జరిగింది. ఈ సంఘటనలో మేరిబాబుపై బోస్ కత్తితో దాడి చేసి గాయపరచాడు. ఈ గొడవలో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో శాంసన్, బోస్ […]
పాత కక్షలను మనసులో పెట్టుకుని ముగ్గురు వ్యక్తులను నరికి చంపిన ఘటన ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, చెన్నుంబొట్ల అగ్రహారంలో చోటుచేసుకుంది. అగ్రహారం ఎస్సీ కాలసీకి చెందిన దిడ్ల శాంసన్, బోస్ అనే తండ్రీ కొడుకులకు, కీర్తిపాటి రత్తయ్య ఆయన కుమారుడు మేరిబాబుకు 2014లో చిన్నపిల్లల విషయంలో గొడవ జరిగింది. ఈ సంఘటనలో మేరిబాబుపై బోస్ కత్తితో దాడి చేసి గాయపరచాడు. ఈ గొడవలో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో శాంసన్, బోస్ కుటుంబం గ్రామాన్ని వదిలి చినజాగర్లమూడికి వెళ్లిపోయింది.
అయితే రుణవిముక్తి పత్రాల పంపిణీ సందర్భంగా శాంసన్, బోస్ స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో వీరికి చెరువు రచ్చబండ వద్ద రత్తయ్య ఆయన మేనల్లుడు జంగాబాబు ఇతర కుటుంబ సభ్యులు కనిపించారు. ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా శాంసన్, బోస్…రత్తయ్య కుటుంబంమీద దాడి చేశారు. ఈ దాడిలో రత్తయ్య, జంగా బాబులను దారుణంగా నరికి చంపారు. జంగాబాబుని కాపాడుకునేందుకు ప్రయత్నించి, విఫలమై మృతదేహం మీద పడి రోదిస్తున్న అతని భార్య సుశీలను కూడా హత్య చేశారు.
ఈ దాడిలో రత్తయ్య భార్య, బంధువు కీర్తిపాటి రాజు, పదవతరగతి చదువుతున్న జంగాబాబు, సుశీలల కుమారుడు తప్పించుకున్నారు. ముగ్గురిని అంతం చేసిన శాంసన్, బోసు పోలీసులు వచ్చే వరకు ఆయుధాలతో అక్కడే ఉన్నారు. చీరాల డిఎస్పీ, సిఐతో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.