పూజలు చేసి... రూ.1.3 కోట్లతో ఉడాయించిన దొంగబాబా!
మనశ్శాంతి కరువైందని పూజలు చేయించుకున్న ఓ కుటుంబానికి కుచ్చుటోపీ పెట్టి 1.3 కోట్ల రూపాయాల డబ్బుని దోచేశాడు ఓ దొంగబాబా. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయని, మనశ్శాంతి కరువైందని బాధపడుతున్న లైఫ్స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబానికి… పూజలు చేయించాల్సిందిగా కొంతమంది బాబాలు, స్వామీజీలు సలహా ఇచ్చారు. ఆ సలహాని పాటించిన మధుసూదన్ రెడ్డి కర్ణాటక నుండి ఒక బాబాని రప్పించారు. ఆయనకోసం ఓ హోటల్ గదిని […]
మనశ్శాంతి కరువైందని పూజలు చేయించుకున్న ఓ కుటుంబానికి కుచ్చుటోపీ పెట్టి 1.3 కోట్ల రూపాయాల డబ్బుని దోచేశాడు ఓ దొంగబాబా. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయని, మనశ్శాంతి కరువైందని బాధపడుతున్న లైఫ్స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబానికి… పూజలు చేయించాల్సిందిగా కొంతమంది బాబాలు, స్వామీజీలు సలహా ఇచ్చారు. ఆ సలహాని పాటించిన మధుసూదన్ రెడ్డి కర్ణాటక నుండి ఒక బాబాని రప్పించారు. ఆయనకోసం ఓ హోటల్ గదిని బుక్ చేశారు. బుధవారం నిర్వహించాల్సిన పూజలకోసం బాబా మంగళవారం సాయంత్రమే కావసిన సామగ్రిని తెప్పించాడు.
బుధవారం ఉదయం 11గం.ల నుండి సాయంత్రం నాలుగు వరకు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న నగదునంతా పూజలో ఉంచాలని బాబా చెప్పాడు. దాంతో 1.3కోట్ల రూపాయల నగదుని పూజ ప్రదేశంలో ఉంచారు. పూజ అనంతరం మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ముగ్గురికి దొంగబాబా ప్రసాదం పెట్టాడు. అది తిని వారు అపస్మారక స్థితికి చేరుకోగా బాబా డబ్బుతీసుకుని ఉడాయించాడు. రెండుగంటల తరువాత సాయంత్రం ఆరుకి స్పృహలోకి వచ్చిన మధుసూదన్ రెడ్డి కుమారుడు, జరిగింది తెలుసుకుని, ఇంకా స్పృహలోకి రాని తన తల్లిదండ్రులను అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆసుపత్రినుండి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఇంట్లో, బాబా దిగిన హోటల్లో ఉన్న సిసిటివి ఫుటేజిని పరిశీలనలోకి తీసుకున్నారు. దొంగబాబా హైదరాబాద్లోనే ఉన్నాడా, నగరాన్ని వదిలేసి వెళ్లిపోయాడా…అనే విషయంమీద దృష్టిపెట్టారు. మధూసూదన్ రెడ్డి దంపతులు పూర్తిగా కోలుకుంటే, బాబా గురించిన మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దొంగబాబా కోసం టాస్క్ఫోర్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.