Telugu Global
NEWS

పులివెందుల చీనిచెట్లు కాపాడా... మోదీకి భయపడే జగన్‌ నాయకుడా?

విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. జగన్ ఒక ఉన్మాదిలాగా మాట్లాడారని, అవినీతి తిమింగలంలాగా ప్రసంగించారని ఉమ ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రభుత్వం పనిచేయడం లేదంటున్నారని…. కానీ పులివెందుల్లో ఎండిపోతున్న చీని, నిమ్మ చెట్లకు నీరిచ్చి బతికించింది తామేనని ఉమ చెప్పుకున్నారు. జగన్ తొలి రీల్ నుంచే విలన్ అని… చంద్రబాబు మాత్రం 14వ రీల్ వరకూ హీరోగానే ఉంటారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ, […]

పులివెందుల చీనిచెట్లు కాపాడా... మోదీకి భయపడే జగన్‌ నాయకుడా?
X

విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. జగన్ ఒక ఉన్మాదిలాగా మాట్లాడారని, అవినీతి తిమింగలంలాగా ప్రసంగించారని ఉమ ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రభుత్వం పనిచేయడం లేదంటున్నారని…. కానీ పులివెందుల్లో ఎండిపోతున్న చీని, నిమ్మ చెట్లకు నీరిచ్చి బతికించింది తామేనని ఉమ చెప్పుకున్నారు. జగన్ తొలి రీల్ నుంచే విలన్ అని… చంద్రబాబు మాత్రం 14వ రీల్ వరకూ హీరోగానే ఉంటారని ఆయన అన్నారు.

కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని… జగన్‌ మాత్రం ఒక్క చంద్రబాబునే ఎందుకు విమర్శిస్తున్నారని ఉమ ప్రశ్నించారు. మోదీని ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలన్నారు. మోదీకి భయపడే జగన్‌ ఒక ప్రతిపక్షనాయకుడేలా అవుతాడని ఉమ ప్రశ్నించారు. పులివెందులకు నీరిచ్చామని ఉమ పదేపదే చెబుతున్నారు. అయినా పులివెందుల ఏపీలో భాగంగా కాదా?. అక్కడి పంటలకు నీరివ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా?. తన సొంతూరు నుంచి ట్యాంకర్లతో నీటిని తరలించి పులివెందుల చీనిచెట్లను కాపాడామన్నంత రేంజ్‌లో ఉమా ప్రచారం చేసుకోవడం భలే ఉంది.

Click on Image to Read:

buggana-rajendranath-reddy-

C-Narasimha-Rao

jc-diwakar-reddy

laxmi parvathi

sakshi

kodali

jyotula

kotamreddy-sridhar-reddy

gottipati

YSRCP-Extensive-Meeting

byreddy-rajashekar-reddy

darmana

bhumana-karunakar-reddy

bhuma-jyotula

trivikaram

First Published:  14 Jun 2016 10:43 PM GMT
Next Story