ప్రియురాలు మోసం చేసిందని...మూడు హత్యలు చేశాడు!
తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో ఓ ప్రేమికుడు, ప్రేమించిన యువతితో పాటు ఆమె తల్లిని, సోదరిని సైతం హత్య చేశాడు. రహీసుద్దీన్ (30), మెహరున్నీసా (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం మెహరున్నీసా తండ్రి మరణించడంతో వారి కుటుంబానికి అతను ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే మెహరున్నీసా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉందని తెలుసుకున్న రహీసుద్దీన్, ఆమెని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. తన స్నేహితుడు జావేద్ (27)తో కలిసి పథకం వేశాడు. మెహరున్నీసా తల్లి సైతం […]
తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో ఓ ప్రేమికుడు, ప్రేమించిన యువతితో పాటు ఆమె తల్లిని, సోదరిని సైతం హత్య చేశాడు. రహీసుద్దీన్ (30), మెహరున్నీసా (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం మెహరున్నీసా తండ్రి మరణించడంతో వారి కుటుంబానికి అతను ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే మెహరున్నీసా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉందని తెలుసుకున్న రహీసుద్దీన్, ఆమెని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. తన స్నేహితుడు జావేద్ (27)తో కలిసి పథకం వేశాడు. మెహరున్నీసా తల్లి సైతం తనని నిర్లక్ష్య చేయడంతో ఆ కక్షని సైతం మనసులో నింపుకున్నాడు.
జావేద్తో కలిసి వారి ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మెహరున్నీసాతో పాటు ఆమె తల్లి(45)ని, తొమ్మిదేళ్ల చెల్లిని… కత్తితో పొడిచి చంపారు. ఆ తరువాత రహీసుద్దీన్ నైనటాల్ వెళ్లిపోయాడు. హత్యల తరువాత ఆ ఇంట్లోంచి చెడువాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నేరస్తుల కోసం గాలింపు మొదలుపెట్టారు. దాదాపు 100 మందిని ప్రశ్నించిన తరువాత వారికి రహీసుద్దీన్ పై అనుమానం కలిగింది. తరచుగా మెహరున్నీసా ఇంటికి వచ్చివెళ్లే అతను హత్యలు జరిగాక కనబడకుండా పోవటం కూడా వారి అనుమానం బలపడేలా చేసింది. పోలీసులు అతనికోసం వెతుకుతుండగానే రహీసుద్దీన్ నైనటాల్ నుండి తనకుతానుగా ఢిల్లీకి తిరిగివచ్చాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ప్రశ్నించగా ముందు తనకేమీ తెలియదన్నా, తరువాత హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. అతను 2004, 2009ల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి కేసులో జైలుకి వెళ్లాడని పోలీసులు తెలిపారు.