సీఎం గారు వారిని తీసిపారేయండి " టీడీపీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్యాలయాలు,మౌలిక సదుపాయాలు లేని వెలగపూడికి వెళ్లేందుకు ఉద్యోగులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడికి వచ్చేందుకు నిరాకరిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తీసివేయాలని సూచించారు. ఇలా ఉద్యోగులను పీకేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పారు. సచివాలయం ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంతో చేశారని… ఎంతో గౌరవం ఇస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. అయినప్పటికీ […]
టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్యాలయాలు,మౌలిక సదుపాయాలు లేని వెలగపూడికి వెళ్లేందుకు ఉద్యోగులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వెలగపూడికి వచ్చేందుకు నిరాకరిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తీసివేయాలని సూచించారు. ఇలా ఉద్యోగులను పీకేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పారు. సచివాలయం ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంతో చేశారని… ఎంతో గౌరవం ఇస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. అయినప్పటికీ రాజధానికి రాలేమని చెప్పడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో సీఎం మెతక వైఖరి విడనాడాలని సూచించారు. వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తీసివేయాలన్నారు. తరలింపుపై ఇబ్బందులుంటే ప్రభుత్వానికి చెప్పుకోవాలే గానీ రాజకీయ పార్టీల నాయకులను కలవడం ఎంతవరకు సమంజసమంటూ ఇటీవల బీజేపీనాయకురాలు పురందేశ్వరిని సచివాలయ ఉద్యోగులు కలవడాన్ని టీడీపీఎమ్మెల్సీ తప్పుపట్టారు. ఇలా చేయడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమేనని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
Click on Image to Read: