ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో చీలిక! ఫ్యాన్, టేబుల్ ఉంటే చాలదా?- యూనియన్ అధ్యక్షుడు
నిర్మాణంలో ఉన్న ఏపీరాజధాని వెలగపూడి ప్రాంతానికి ఉద్యోగుల తరలింపు అంశం సచివాలయం ఉద్యోగుల్లో చీలిక తెచ్చింది. కొద్దిరోజులక్రితం సచివాలయ ఉద్యోగులు తరలింపును ఆపాలంటూ ర్యాలీగా వెళ్లి సీఎస్ను కలవడంపై ఏపీ సచివాలయం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మురళీ కృష్ణ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తరలింపును వాయిదా వేయించాం అంటూ స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. […]
నిర్మాణంలో ఉన్న ఏపీరాజధాని వెలగపూడి ప్రాంతానికి ఉద్యోగుల తరలింపు అంశం సచివాలయం ఉద్యోగుల్లో చీలిక తెచ్చింది. కొద్దిరోజులక్రితం సచివాలయ ఉద్యోగులు తరలింపును ఆపాలంటూ ర్యాలీగా వెళ్లి సీఎస్ను కలవడంపై ఏపీ సచివాలయం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మురళీ కృష్ణ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తరలింపును వాయిదా వేయించాం అంటూ స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. వెలగపూడికి తాను స్వయంగా వెళ్లాలని అన్ని సౌకర్యాలు ఉన్నాయని మురళీ కృష్ణ చెప్పారు. జూన్ 27 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు తరలివెళ్లాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. మౌలిక సదుపాయాలు లేవు అనడంపైనా మురళీ తీవ్రంగా స్పందించారు. పనిచేసుకోవడానికి ఫ్యాన్, టేబుల్, కంప్యూటర్ ఉంటే చాలదా అని ప్రశ్నించారు. ఒకవేళ వాటిని ప్రభుత్వం సమకూర్చకపోతే ఖాళీగా కూర్చుందాం అని అన్నారు.
కొందరు రాజకీయ ఉద్దేశాలతో ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 27నుంచి వెలగపూడి వేదికగానే పాలన సాగుతుందని మీడియా మైకులు ఉంచేందుకు ఏర్పాటుచేసిన పోడియంవద్ద బల్లగుద్ది చెప్పారు మురళీ కృష్ణ. అయితే మురళీ కృష్ణవ్యాఖ్యలను బట్టి సచివాలయం ఉద్యోగుల్లో చీలిక వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మురళీకృష్ణ ప్రభుత్వ పక్షాన గట్టిగానే మాట్లాడారు. ఉద్యోగ సంఘాలనేతల ప్రమేయం లేకుండా ఉద్యోగులు నేరుగా సీఎస్ను కలవడంపై మురళీకృష్ణ తీవ్రంగా స్పందించడం గమనార్హం.
Click on Image to Read: