టీడీపీ నేత గండిబాబ్జీ సతీమణి అరెస్ట్
విశాఖ జిల్లాకుచెందిన మాజీఎమ్మెల్యే, టీడీపీ నేత గండిబాబ్జీ సతీమణి విజయను పోలీసులు అరెస్ట్ చేశారు.చీటింగ్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. విజయ రిటైర్డ్ డీఎస్సీ కూడా. 2013లో విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసమున్న సమయంలో కొండపల్లి విజయ విజయవాడకు చెందిన ఎం.గిరీశం రెడ్డి, జి.గోపిరెడ్డి, ఎన్.అప్పనాయుడు, బి.జగన్నాథరావు అనే కూరగాయల వ్యాపారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. అందుకోసం వారి దగ్గరనుంచి రూ.4.08 లక్షలు తీసుకున్నారు. ఆరు నెలల తరువాత ఆమె సిరిపురంలో ఇళ్లు ఖాళీ చేసి మరో […]
విశాఖ జిల్లాకుచెందిన మాజీఎమ్మెల్యే, టీడీపీ నేత గండిబాబ్జీ సతీమణి విజయను పోలీసులు అరెస్ట్ చేశారు.చీటింగ్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. విజయ రిటైర్డ్ డీఎస్సీ కూడా. 2013లో విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసమున్న సమయంలో కొండపల్లి విజయ విజయవాడకు చెందిన ఎం.గిరీశం రెడ్డి, జి.గోపిరెడ్డి, ఎన్.అప్పనాయుడు, బి.జగన్నాథరావు అనే కూరగాయల వ్యాపారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. అందుకోసం వారి దగ్గరనుంచి రూ.4.08 లక్షలు తీసుకున్నారు.
ఆరు నెలల తరువాత ఆమె సిరిపురంలో ఇళ్లు ఖాళీ చేసి మరో చోటకి వెళ్లిపోయారు. ఆమెను కలిసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయినా ఇప్పటి వరకు విజయపై ఎలాంటి చర్యలు లేవు. ఎట్టకేలకు శనివారం చెల్లెలు ఇంట్లో విజయ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వైద్యపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఉదయం గండి బాబ్జీకి కూడా తిరుపతి మహానాడు వద్ద అవమానం ఎదురైంది. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలను మహానాడు మెయిన్ గేటు వద్దే పోలీసులు ఆపేశారు. వీఐపీ గ్యాలరీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో అభ్యంతరం చెప్పారు. తాము టీడీపీ నేతలమని చెప్పినా తమకు ఆదేశాలు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు గేటు బయటే నిలబెట్టారు. ఈ సమయంలో గండి బాబ్జీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయన అనుచరులు, ఎమ్మెల్యే సర్వేశ్వరరావు అందరూ అవమానకరంగా నిలబడిపోయారు. అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలంతా ఈ సన్నివేశాన్ని విచిత్రంగా చూస్తూ వెళ్లారు. చివరకు తమకు తెలిసిన టీడీపీ నేతలకు ఫోన్ చేసి తమను పోలీసులు లోనికి అనుమతించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వారిని లోనికి అనుమతించారు.
Click on Image to Read: