నిహారికకు హ్యాండ్ ఇచ్చిన మెగా బ్రదర్స్
ఒక మనసు అనే సినిమాతో వెండితెర ప్రయాణాన్ని మొదలుపెడుతోంది మెగా తనయ నిహారిక. ఆమెకు బోలెడంత మెగాఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 18న శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్ కు మెగా హీరోలందర్నీ ఆహ్వానించి భారీ ప్రచారం కొట్టేయాలని భావించారు. కానీ నిహారిక ఆశలకు మెగాబ్రదర్స్ బ్రేక్స్ వేశారు. ఒక మనసు అనే సినిమా ఆడియోకు రావడం కుదరదని కరాఖండిగా చెప్పేశారు. అవును… […]
BY sarvi13 May 2016 12:16 AM GMT
X
sarvi Updated On: 13 May 2016 2:08 AM GMT
ఒక మనసు అనే సినిమాతో వెండితెర ప్రయాణాన్ని మొదలుపెడుతోంది మెగా తనయ నిహారిక. ఆమెకు బోలెడంత మెగాఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 18న శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్ కు మెగా హీరోలందర్నీ ఆహ్వానించి భారీ ప్రచారం కొట్టేయాలని భావించారు. కానీ నిహారిక ఆశలకు మెగాబ్రదర్స్ బ్రేక్స్ వేశారు. ఒక మనసు అనే సినిమా ఆడియోకు రావడం కుదరదని కరాఖండిగా చెప్పేశారు. అవును… చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ కూడా ఈ ఫంక్షన్ కు హాజరుకావడం లేదు. మరోవైపు రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ వస్తారని యూనిట్ చెబుతున్నప్పటికీ… వాళ్లిద్దర్లో కూడా కేవలం ఒకరు మాత్రమే వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటివరకు సాయిధర్మతేజ, వరుణ్ తేజ మాత్రమే ఈ ఫంక్షన్ కు వచ్చే మెగాహీరోల్లో కన్ ఫర్మ్ గా కనిపిస్తున్నారు. చెర్రీ, బన్నీ ఇద్దరూ వస్తారా… లేక ఇద్దర్లో ఒకరే వస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. పవన్, చిరు మాత్రం ఆడియోకు రావడం లేదు.
Next Story