గులాబీ పార్టీకి గుత్తా శాపనార్థాలు!
కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కోపం వచ్చింది.. ఆగ్రహం ఆపుకోలేక గులాబీ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఎంపీ గుత్తాకు కోపం ఎందుకు వచ్చిందంటే.. టీఆర్ ఎస్ పార్టీ నేతలు సోనియాను విమర్శించడమే..! పాలేరు ఉప ఎన్నిక, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి కేటీఆర్, హరీశ్రావులు కాంగ్రెస్పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణకు జరిగిన అన్యాయమంతా కాంగ్రెస్ హయాంలోనేనని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై గుత్తా స్పందించారు. తెలంగాణ […]
BY sarvi1 May 2016 2:33 AM GMT
X
sarvi Updated On: 1 May 2016 11:45 AM GMT
కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కోపం వచ్చింది.. ఆగ్రహం ఆపుకోలేక గులాబీ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఎంపీ గుత్తాకు కోపం ఎందుకు వచ్చిందంటే.. టీఆర్ ఎస్ పార్టీ నేతలు సోనియాను విమర్శించడమే..! పాలేరు ఉప ఎన్నిక, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి కేటీఆర్, హరీశ్రావులు కాంగ్రెస్పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణకు జరిగిన అన్యాయమంతా కాంగ్రెస్ హయాంలోనేనని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై గుత్తా స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిట్టడం సమంజసం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సోనియాను కలిసిన మాట వాస్తవం కాదా? 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం కాదా? అని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది మా పార్టీతోనే అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కోట్లాది మంది తెలంగాణవాసుల కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీని తిడితే పాపాలు తగిలిపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార మదంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని , చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా పాపం చుట్టుకుంటుందని హెచ్చరించారు.
Next Story