జైల్లోంచి బయటకు రాగానే చంపేశారు!
హత్యా ప్రయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకువచ్చిన వ్యక్తి ఒక్క గంటలోనే హత్యకు గురయ్యాడు. బెంగలూరులోని బసాపురా జంక్షన్లో ఈ హత్య చోటుచేసుకుంది. హత్యకు గురయిన వ్యక్తి బెంగలూరులోని మడివాలా ప్రాంతానికి చెందినవాడు. ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల సందర్భంలో శివప్రసాద్, రాజా అనే వ్యక్తిమీద హత్యా ప్రయత్నం చేశాడు. ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న శివప్రసాద్ గురువారం ఉదయం పదిన్నరకు జైలునుండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన స్నేహితుడు నాగరాజుతో కలిసి […]
హత్యా ప్రయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకువచ్చిన వ్యక్తి ఒక్క గంటలోనే హత్యకు గురయ్యాడు. బెంగలూరులోని బసాపురా జంక్షన్లో ఈ హత్య చోటుచేసుకుంది. హత్యకు గురయిన వ్యక్తి బెంగలూరులోని మడివాలా ప్రాంతానికి చెందినవాడు.
ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల సందర్భంలో శివప్రసాద్, రాజా అనే వ్యక్తిమీద హత్యా ప్రయత్నం చేశాడు. ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న శివప్రసాద్ గురువారం ఉదయం పదిన్నరకు జైలునుండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన స్నేహితుడు నాగరాజుతో కలిసి సోదరి ఇంటికి బైక్మీద వెళుతుండగా దాదాపు ఏడుగురు దుండగులు వారిని టూవీలర్స్మీద వెంటడించి అటకాయించారు. శివప్రసాద్మీద పదునైన ఆయుధాలతో దాడిచేసి హతమార్చారు. అతనితో ఉన్న నాగరాజు పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో రాజామీద చేసిన దాడికి ప్రతీకారంగానే దుండగులు శివప్రసాద్ని హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజే శివప్రసాద్ గురించిన వివరాలను హంతకులకు అందించి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో నాగరాజుని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.