యువతి అనుమానాస్పద మృతి...తల్లిదండ్రులపై అనుమానం!
మరికొద్ది రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన ఒక యువతి అనుమానాస్పదంగా మరణించిన ఘటన కర్ణాటక లోని చంద్రావతి గ్రామంలో చోటుచేసుకుంది. మధుకుమారి (22) లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అయితే ఆమె ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గొడవైంది. తనకు నచ్చినవాడినే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా తమ కులానికి చెందిన అబ్బాయితో ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నెల 29న […]
మరికొద్ది రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన ఒక యువతి అనుమానాస్పదంగా మరణించిన ఘటన కర్ణాటక లోని చంద్రావతి గ్రామంలో చోటుచేసుకుంది. మధుకుమారి (22) లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అయితే ఆమె ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గొడవైంది. తనకు నచ్చినవాడినే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా తమ కులానికి చెందిన అబ్బాయితో ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నెల 29న వివాహం జరగాల్సి ఉంది. అయితే హఠాత్తుగా మధుకుమారి మరణించింది. తమ కుమార్తె ఛాతీ నొప్పితో చనిపోయిందని వెల్లడించిన కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ అప్పటివరకు ఉన్న పరిస్థితులు, మధుకుమారి హఠాత్తుగా మరణించడం… వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దీన్ని పరువుహత్యగా అనుమానించి కేసు నమోదు చేశారు. మధుకుమారి తల్లిదండ్రులను, సోదరుని విచారిస్తున్నారు.