అయిదో అంతస్తునుండి పడి....అనుమానాస్పద మృతి!
హైదరాబాద్, అమీర్పేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. విజయ డయాగ్నొస్టిక్స్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అరుణిమ గురువారం ఉదయం ఆరుగంటలకు నాలుగు అంతస్తుల బిల్డింగ్ టెర్రస్ మీద నుండి కిందపడి మృతి చెందింది. అరుణిమ స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. అరుణిమతో పాటు ఆమె సెల్ఫోన్ కూడా కిందపడింది. ఆ సమయంలో ఆమె తన తల్లితో ఫోన్లో మాట్లాడుతోంది. ఫోన్తో సహా పడిపోవడంతో అరుమణిమది ఆత్మహత్య కాదని ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. అరుణిమ తల్లి కూడా దీనిపై ఎలాంటి అనుమానాలు […]
హైదరాబాద్, అమీర్పేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. విజయ డయాగ్నొస్టిక్స్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అరుణిమ గురువారం ఉదయం ఆరుగంటలకు నాలుగు అంతస్తుల బిల్డింగ్ టెర్రస్ మీద నుండి కిందపడి మృతి చెందింది. అరుణిమ స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. అరుణిమతో పాటు ఆమె సెల్ఫోన్ కూడా కిందపడింది. ఆ సమయంలో ఆమె తన తల్లితో ఫోన్లో మాట్లాడుతోంది. ఫోన్తో సహా పడిపోవడంతో అరుమణిమది ఆత్మహత్య కాదని ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. అరుణిమ తల్లి కూడా దీనిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు వెల్లడించారు. అరుణిమ పడిపోయిన ఆ టెర్రస్ కి ఉన్న పిట్టగోడ కేవలం 1.5 అడుగుల ఎత్తుమాత్రమే ఉంది. అయితే పోలీసులు ఇంకా దీన్ని ప్రమాదంగా నిర్దారించలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.