జగన్ దమ్ముంటే రా... ప్రత్తిపాటి, నారాయణ నిజాయితీకి నిలువుటద్దాలు!
అమరావతి భూకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సాక్షి, వైసీపీపై విరుచుకుపడ్డారు. తాను రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది నిజమేనని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. బినామీల పేర్లతో భూములు కోనాల్సిన అవసరం తమకు లేదన్నారు. జగన్కు దమ్ముంటే ఇరువురి ఆస్తులపై చర్చించేందుకు ప్రకాశం బ్యారేజ్ వేదికగా చర్చకు రావాలని పయ్యావుల సవాల్ విసిరారు. జగన్ రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే చర్చకు రావాలని అన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు నిజాయితీని నిలువుటద్దాలాంటి వారని […]
అమరావతి భూకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సాక్షి, వైసీపీపై విరుచుకుపడ్డారు. తాను రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది నిజమేనని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. బినామీల పేర్లతో భూములు కోనాల్సిన అవసరం తమకు లేదన్నారు. జగన్కు దమ్ముంటే ఇరువురి ఆస్తులపై చర్చించేందుకు ప్రకాశం బ్యారేజ్ వేదికగా చర్చకు రావాలని పయ్యావుల సవాల్ విసిరారు. జగన్ రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే చర్చకు రావాలని అన్నారు.
మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు నిజాయితీని నిలువుటద్దాలాంటి వారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ చెప్పారు. అమరావతిలో ఎవరో భూములు కొనుగోలు చేస్తే దాన్ని మంత్రులతో లింక్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ కు సిబిఐ విచారణ ఎదుర్కోవడం బాగా అలవాటైందని.. అందుకే పదేపదే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి భూదందాలో తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి రావెల కిషోర్ కూడా స్పందించారు. తన భార్య 83 సెంట్ల భూమిని మాత్రమే కొన్నారని చెప్పారు. అంతకుమించి తనకు బినామీ ఆస్తులు ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రావెల సవాల్ విసిరారు.
Click on image to read: